constable transfered for kicking father of deceased కానిస్టేబుల్ పై చర్యలతో సరా.? సత్యాన్వేషణ చేస్తున్నారా.?

Constable sridhar reddy transfered for kicking father of deceased student

Sandhya Rani, deceased student father, deceased father kicked, student father kicked, constable, narayana junior college, eduala Nagulapally, KTR, Private College, Student, Patancheru, Sangareddy Police, Home Minister, TS DGP, Hyderabad, Telangana, crime

A police constable who purportedly kicked a man, who attempted to prevent police from taking for postmortem, the dead body of his teenage daughter, who allegedly committed suicide earlier this week, has been attached to Sangareddy District headquarters. A departmental probe has also been ordered against him.

కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

Posted: 03/07/2020 05:31 PM IST
Constable sridhar reddy transfered for kicking father of deceased student

సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేసిన అధికారులు.. శాఖపరమైన విచారణను జరిపించిన తరువాత విధుల్లోకి పంపుతారని పలువురు అభిప్రాయపడుతున్నా.. ఇది కేవలం వారం.. పది రోజుల చర్యలేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు జిల్లా ఎస్సీ వ్యాఖ్యలనే వారు కోట్ చేస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డికి అడ్డుకుంటున్నది అమె తండ్రి అని తెలియకుండానే అతడ్ని తన్నాడని సమర్ధించడమే ఈ అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

అసలు పోలీసులు చేయిచేసుకోవడమే తప్పు అని చెబుతున్న పోలీసు ఉన్నతాధికారులు ఓ వైపు ఘోషిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. ఇక ఈ విషయాన్ని పక్కనబెట్టిన జిల్లా ఎస్సీ కానిస్టేబుల్ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తూనే.. అతనికి విషయం తెలియకుండానే మృతురాలి తండ్రిని తన్నాడని అన్నారు. శాఖపరమైన విచారణ జరపిన తరువాత కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై చర్యలు వుంటాయని అన్నారు. ఇక ఆత్మహత్య చేసుకన్న విద్యార్థిని సంధ్యరాణి కేసులోనే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత కేసు దర్యాప్తు కోనసాగుతుందని అన్నారు.

హైదరాబాద్ శివార్లలోని తెల్లపూర్ పురపాలక సంఘం పరిసదిలోని ఈదుల నాగులపల్లి గ్రామ పరిధిలోని నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పదంగా మరణించింది. పటాన్ చెరువులోని ప్రభుత్వ అసుపత్రి మార్చురీలో సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు భద్రపర్చగా, దానిని ఏబివీపి విద్యార్థి సంఘాల నేతలు, మృతురాలి బందువులు జాతీయ రహదారిపైకి తీసుకువచ్చి నిరసనకు దిగుదామని భావించిన అమె తండ్రిని పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంధ్యారాణి తండ్రిని నిలువరించే ప్రయత్నంలో భాగంగా అతడ్ని బూటుకాలుదో తన్నిన కానిస్టేబుల్ పై విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి.


తన కూతురిని పొగొట్టుకుని పుట్టెడు గర్భశోకంలో వున్న ఆయనను.. పోలీసులు డొంకలో తన్నడమేంటని నెట్ జనులు విమర్శలు చేయడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, మంత్రి కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ పోలీసులు ఇంత ఆటవికంగా ప్రవర్తించిన వైనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీల దృష్టికి తీసుకెళతానని ప్రకటించారు. కష్టకాలంలో బాధితుల పట్ల ప్రభుత్వ అధికారులు సానుభూతి ప్రదర్శించాలని ఎవరైనా ప్రాథమికంగా కోరుకుంటారని ట్వీట్ చేశారు.

అయితే ఆ తండ్రిని తన్నిన ఘటననే ప్రధానంగా శీర్షికలకు ఎక్కిందే తప్ప.. కార్పోరేట్ కాలేజీల్లో ఇలాంటి మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయన్న అంశంలో మాత్రం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం .తీసుకున్న ధాఖలాలు లేవు. నారాయణ, శ్రీచైతన్య, శ్రీగాయిత్రి, ఇలా రాష్ట్రంలో ఇంటర్ విద్యను వ్యాపారంగా మార్చిన కార్పోరేట్ కాలేజీల్లో విద్యార్థులు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారన్న విషయమై ఇప్పటివరకు ప్రభుత్వాలు దృష్టిసారించింది లేదు.?

ఈ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి మార్గదర్శక సూత్రాలు, నిబంధనలు తీసుకున్న పాపన పోలేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ దిశగా కూడా అలోచించాలని పలువురు కోరుతున్నారు. కాగా. ఇంటర్ విద్యను కూడా ఆన్ లైన్ కౌన్సిలింగ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి నాలుగేళ్లు గడిచినా.. ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణవాసులు కోరుతున్నారు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles