వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ రమారమి తట్టాబుట్టా సర్దుకుని వలస వెళ్లనున్నారా..? మరికొద్ది రోజుల్లో రానున్న ఉప ఎన్నికలకు ముందుకు ఎంపీ ఈ నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష పార్టీకి షాక్ ఇవ్వనున్నారా..? అధికార పార్టీ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారా..? ఇంతకీ ఎవరా ఎంపీ..? అంటే.. కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ బుట్టా రేణుక. పార్టీ ఫిరాయించేందుకు అన్ని మార్గాలను సుగమం చేసుకుని.. తనను గెలిపించిన పార్టీ అధినేత జగన్ నిర్వహిస్తున్న సమావేశానికి డుమ్మా కోట్టి మరీ.. అధికార పక్షానికి చెందిన యువనేత, మంత్రి నారా లోకేష్ తో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు బుట్టా రేణుక డుమ్మా కోట్టి మరీ.. లోకేష్ తో భేటీ కావడం.. ఒక్కసారిగా కర్నూలు జిల్లా రాజకీయాలను, రాష్ట్ర రాజకీయాలలో అసక్తిగా మారింది. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలో మంత్రి లోకేష్ పర్యటించారు. ఈ సమయంలో అమె ఆయనను కలిశారు. ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే గతంలోనూ అమె ఇలాంటి చర్యలకే పాల్పడినా.. వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు.
2014 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, కర్నూలు జిల్లా నుంచి గెలిచిన ఎంపీ బుట్టా రేణుక.. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అయితే తాను టీడీపీలో చేరడం లేదని స్ఫష్టం చేసిన అమె.. తన భర్తను మాత్రం టీడీపీలోకి వెళ్లకుండా అపలేకపోయారు. స్వయంగా చంద్రబాబు ఆయనను పార్టీ కండువా వేసి సార్టీలోకి అహ్వానించారు. అయినా అమె గత మూడేళ్లుగా వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను కర్నూలు నుంచి మరోసారి ఎంపీగా బరిలోకి దింపకుండా.. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దింపుతారన్న వార్తలు కూడా వచ్చాయి.
దీంతో దీపం వుండగానే ఇల్లు చక్కబెటుకోవాలని అమె భావిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఏకంగా నంద్యాల ఉప ఎన్నికల ముందు ఇలాంటి ఫిరాయింపులు జరిగితే.. అది అధికార పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలసిరాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నాగిరెడ్డి అకాల మరణంతో స్థానికంగా సానుభూతి వెల్లివిరిసినా.. ప్రసుత్తం ప్రభుత్వంపై మాత్రం ప్రజల్లో తీవ్ర అసహనం వుందన్నది సీఎం చంద్రబాబు మాటల్లోనే స్పష్టమైంది. మా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు తీసుకుంటున్నారు కాబట్టి మాకు ఓటు వేయాలని ఆయన ఇటీవల ప్రకటించడం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే ఈ తరుణంలో ఎంపీ పార్టీ ఫిరాయింపుకు పాల్పడినా.. టీడీపీకి నష్టమే కానీ లాభం లేదన్నది రాజకీయ విశ్లేషకులు భావన.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more