దేశ పౌరవిమానయానంలో అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారా..? లేక అందరి పట్ల ఒకే విధానాన్ని కనబరుస్తున్నారా..? అంటే పక్షపాత ధోరణి వుందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అయిన వారికి అకుల్లోనూ.. కానీ వారికి కంచాల్లోనూ వడ్డించే విధంగా పౌర విమానయాన శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ అరోపణలు గుప్పుమంటున్నాయి. తాను పొందిన బిజినెస్ క్లాస్ టిక్కట్టుకు బదులు ఎకానమీ క్లాసులో కూర్చోబెట్టిన ఎయిర్ ఇండియా అధికారిపై చేయిచేసుకున్న ఘటనలో శివసేన ఎంపీ రవింద్ర గైక్వాడ్ ను ముప్పుతిప్పలు పెట్టి చివరాఖరును అతనిపై విధించిన సస్పెషన్ ను రద్దు చేసిన అధికారులు అదే అటు కేంద్రంలోనూ ఇటు గుజారత్ రాష్ట్రంలోనూ అధికారంలో వున్న బీజేపికి చెందిన ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ కుమారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన జైమన్ పటేల్ (30) పట్ల వేర్వేరుగా స్పందించిన తీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది.
పీకత వరకు మద్యం తాగి విమానాశ్రయంలో అధికారులతో వాదనకు దిగి వీరంగమేసి జైమన్ పటేల్ పట్ల అధికారులు చర్యలు తీసుకునేందుకు జంకుతున్నారు. రవీంద్ర గైక్వాడ్ ఘటన నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ పలు నూతన నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనల్లో విమాన ప్రయాణికులు విమానాశ్రయ సిబ్బందితో వాదనకు దిగినా.. అనుచితంగా వ్యవహరించినా వారిపై నో ప్లైయింగ్ లిస్ట్ ఓపెన్ చేస్తామని కూడా అధికారులు తెలిపారు. మరి జైమన్ పటేల్ పై పౌరవిమానయాన శాఖ ఎందుకు నో ప్లైయింగ్ లిస్ట్ జాబితాలో పేరును ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తుంది.
భార్య ఝలక్, కుమార్తె వైష్వితో కలిసి గ్రీస్ వెళ్లేందుకు జైమన్ పటేల్ ఉదయం 4 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. వీల్ చెయిర్ లో కూర్చున్న జైమన్ పటేల్ ఇమ్మిగ్రేషన్ తనిఖీలు కూడా పూర్తి చేయించుకున్నారు. ఆయన పూటుగా మద్యం తాగడంతో కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో, ఆయనను వీల్ చెయిర్ లో కూర్చోబెట్టారని సమాచారం. అప్పటికీ దుర్వాసన వస్తుండడంతో విమానంలో ఆయనను ఎక్కించేందుకు ఖతార్ ఎయిర్ వేస్ సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన వారితో వాదనకు దిగారు. డిప్యూటీ సీఎం కొడుకునే ఆపుతారా? అంటూ వీరంగంవేసి, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదం గుజరాత్ లో కలకలం రేపడంతో... దీనిపై గుజరాత్ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ వివరణ ఇస్తూ...తన కుమారుడు అనారోగ్యం కారణంగా నడవలేక వీల్ చెయిర్ లో కూర్చున్నాడని అన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ప్రత్యర్ధులు అర్థం పర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే విమాన సిబ్బందితో వాదనకు దిగిన జైమన్ పటేల్ తాను అనారోగ్యం బారిన వున్నానని ఎందుకు చెప్పలేకపోయారు. అయినా అనారోగ్యంతో వున్న వ్యక్తి భార్య పిల్లలతో కలసి విదేశాలకు విహారయాత్రకు ఎందుకు పయనమయ్యారు..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
వీటిని పక్కన బెడితే.. విమాన సిబ్బందితో వాదనకు దిగి వీరంగం చేసిన జైమన్ పటేల్ పై నో ప్లెయింగ్ లిస్ట్ జాబితాలో పేరును ఎందుకు నమోదు చేయలేదన్నది అసలు ప్రశ్న. ఇక పార్లమెంటు సభ్యుడిని ముప్పుతిప్పలు పెట్టిన ఘటనలో సదరు ఎంపీ విమానసిబ్బంది బాధితుడినని స్వయంగా పార్లమెంటులోనే చెప్పాడు. అయితే ఓ ఎంపీ కన్నా ఉప ముఖ్యమంత్రి తనయుడికి అధిక ప్రాథాన్యతను ఇచ్చి అతన్ని కాపాడే బాధ్యతను విమానయాన సిబ్బంది ఎందుకు భుజాన వేసుకున్నారన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more