తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కళా వెంకట్రావు మంత్రి వర్గంలో చేరిపోవటంతో ఇప్పటికే ఖాళీ అయిపోయింది. మహానాడు సమీపిస్తుండటంతో ఈ దశలో కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న దానిపై చర్చ మొదలైంది. సీనియర్ ఎమ్మెల్యే, వైసీపీ నుంచి టీడీపీ కి వలస వచ్చిన జ్యోతుల నెహ్రూకు కేబినెట్ పోస్టు పదవి దక్కే అవకాశం ఉండటంతో... ఏకంగా డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్పకే ఉద్వాసన తప్పదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
సాధారణంగా టీడీపీ పార్టీ పదవిని కాపు కట్టబెట్టడం కొన్నాళ్ల నుంచి సాగుతూ వస్తోంది. దీంతో ఆ సామాజిక వర్గానికే ఇద్దామన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు చినరాజప్ప కన్నా బెటర్ ఆప్షన్ లేదన్న ఓ నిర్ణయానికి వచ్చేశాడని, మహానాడు వేదికగా ఈ ప్రకటన కూడా జరగబోతుందని అంతర్గతంగా నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న అసంతృప్తత నేతలకు.. నెహ్రూకు మంత్రి పదవి ఇస్తే ఇంకా గనుక రగిలిపోయి పార్టీ నుంచి బయటకు వెళ్లే ఆలోచన చేస్తారని కీలక నేతలు ఆందోళన చేస్తున్నారు.
ఈ అంశాలను పక్కనబెడితే కీలకమైన హోం శాఖ నుంచి తప్పుకునేందుకు చిన్న రాజప్ప సిద్ధంగా ఉంటాడా? అన్న డౌట్లు మొదలవుతున్నాయి. కానీ, పార్టీకి వీరవిధేయుడిగా ఉంటూ.. తన ఆదేశాలను పాటించే రాజప్పకు ఎట్టి పరిస్థితుల్లో బాబు ద్రోహం చేయడనే కొందరు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగినా పదవి త్యాగం చేసేందుకు రాజప్ప సిద్ధంగా ఉన్నాడన్నది మరో టాక్. పరిస్థితులు తారు మారు అయ్యే సూచనలు గనుక ఉంటే ఆ పదవిని దళిత నేత అయిన వర్ల రామయ్యకు కట్టబెట్టాలన్న ప్రతిపాదన కూడా రెడీ ఉందంట. మే 27, 28 తేదీల్లో ఏం జరగబోతుందన్న దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more