పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అటు అన్ని సామాజిక మాద్యమాల ద్వారా కేంద్రమంత్రికి సెగ తగిలేలా కామెంట్లు పెడుతున్నారు. తెలుగుదేశం నేతల నిజస్వరూపం ఇదేనని కొందరు కామెంట్లు పెడుతుండగా.. వాడుకుని వదిలేయడం తెలుగుదేశం నేతలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలలో ఒటమి అంచున నిలిచిన తెలుగదేశం పార్టీని.. ఆ పార్టీ నేతల గెలుపును తన భుజస్కంధాలపై వేసుకుని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసిన పవన్ ఎవరో తెలియదనే స్థాయికి టీడీపీ నేతలు దిగజారరంటే వారు ఎంతటి కృతజ్ఞత కలవారో ఇట్టే అర్థమవుతుందని మరికొందరు వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు.
పవన్ కల్యాన్ చేసిన ప్రచారం వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. టీడీపీకి చెందిన నేతలు కేంద్రమంత్రులయ్యారని ఇంకొందరు అంటున్నారు. కేంద్రమంత్రులయ్యాక కొందరు టీడీపీ నేతలకు కేవలం బీజేపి మాత్రమే కనిపిస్తుందని, తమను గెలిపించిన నేతలు, ఓట్లేసిన ప్రజలు కనిపించరని కూడా పవన్ అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రతిపక్షం కన్నా కేవలం ఐదు లక్షల పైచిలుకు ఓట్లు సాధించడంతోనూ టీడీపీ అధికారంలోకి వచ్చిందని.. ఆ ఐదు లక్షల ఓట్లు టీడీపీకి సాధించిపెట్టింది పవన్ జనసైన్యమేనన్న విషయం కూడా కేంద్రమంత్రులు మర్చిపోతారని పవన్ ఫ్యాన్స్ దుయ్యబట్టారు.
పవన్ కల్యాన్.. అశోక్ గజపతి రాజుకు మాత్రం తెలియకపోవడం.. అదే పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి మాత్రం తెలియడంలో ఒక తేడా వుందని, అదే ఆయనకు లభించిన కేంద్రమంత్రి పదవని ఇంకోందరు పవన్ ఫ్యాన్స్ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజకు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పై విమానయాన సస్పెన్షన్ విధించిన క్రమంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో పరిచయమైన తరువాత.. ఆయనకు మరెవరూ తెలియడం లేదన్న విమర్శలు మాత్రం పవన్ కల్యాన్ ఫాన్స్ అందరిలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇక మరికొందరు మాత్రం ఆయనకు అధికారాన్ని అందించిన జనసేన కన్నా.. శివసేన మాత్రమే బాగా తెలుసునని అంటున్నారు.
పపన్ ఎవరో తెలియదని అశోక్ గజపతిరాజు చెప్పడం సిగ్గు చేటని జనసేన నేత పోతిన వెంకట మహేష్ విమర్శించారు. 2014 ఎన్నికల్లో అశోక్ ఎంపీగా గెలిచేందుకు పవన్ కల్యాణే కారణమని ఆయన అన్నారు. అంతకు ముందు ఎన్నికల్లో ఆయనను విజయనగరం ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతిని రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కోరారు. అశోక్ గజపతిరాజులో రాచరికపు అహంభావ పోకడలు ఇంకా పోలేదని మహేష్ మండిపడ్డారు. పవన్ పై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే... రాష్ట్ర ప్రజలు ఆయనకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అయితే ఈ వివాదానికి టీడీపీ నేతలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో.. వేచి చూడాలి. లేక అగ్నికి అజ్యం పోస్తారో అన్నది కాలమే తేల్చాలి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more