తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మొదటి నుంచే కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే కొరుకుంటు ఉంటాడు. దేశంలోనే బలమైన ముఖ్యమంత్రిగా పేరున్నప్పటికీ కేంద్రం సాయం కూడా కీలకం అనే ఆలోచన ఉండటమే అందుకు కారణం. అందుకే నోట్ల రద్దు, జీఎస్టీ కోసం హడావుడిగా అసెంబ్లీని హాజరుపరిచి బిల్లుకు మద్ధతు ఇవ్వటం, సహా పలు అంశాలతో బీజేపీ ప్రభుత్వానికి మద్ధతు ప్రకటిస్తూనే ఉన్నాడు. అయితే రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మారుతున్న పరిస్థితులను రాజకీయ విశ్లేషకులు ఆసక్తి పరిశీలిస్తున్నారు.
నిజానికి ఎన్డీయే ప్రభుత్వానికి ప్రత్యక్ష మద్ధతు ఇవ్వకపోయిన పరోక్షంగా మాత్రం వాళ్లు తీసుకునే ఏ నిర్ణయానికైనా టీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తూనే వస్తోంది. ఆ మధ్య కేబినెట్ లో తమ ఎంపీలకు పదవులు ఇస్తారన్న కండిషన్ మీద ఎన్డీయేలో చేరేందుకు కేసీఆర్ అంగీకరించాడనే పుకారు రేగింది. కేంద్రంలోని మోదీ సర్కారుతో స్నేహపూర్వకంగా ఉంటున్నామన్న సంకేతాలను పలుమార్లు పంపాడు కూడా. కానీ, ఇప్పుడు మిర్చి పెట్టిన ఘాటుతో బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య కదిలిస్తే మాటల తుటాలు పేలుతున్నాయి.
స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ రైతుల కష్టాలను తీర్చేందుకు టీఆర్ఎస్ ఏమీ చేయడం లేదు కాబట్టే తాము కల్పించుకున్నామని వ్యాఖ్యానించటం, ఇక్కడ పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగమని టీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు ముందులా ఉన్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీ నిలిపే అభ్యర్థికి తాము మద్దతిచ్చేది లేదని టీఆర్ఎస్ చెప్పడం లేదు. అలాగని ఎన్డీయే నిలిపే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆ పార్టీ సీనియర్ నేత పీ రాజేశ్వర్ రెడ్డి స్వయంగా వెల్లడించడం గమనార్హం.
బీజేపీ నిలిపే అభ్యర్థిపై ఏకాభిప్రాయం కుదరని పక్షంలో, మరో అభ్యర్థి పేరును తెరపైకి తేవాలన్నది సోనియా అభిప్రాయం. ఆ సమయంలో సోనియాతో చాలా దగ్గరి సంబంధాలే ఉన్న కేసీఆర్ ఆమె కోరితే మద్దతు ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేం. కాగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం, విపక్షాలను పక్కన బెడితే, తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ 25 వేల ఓట్ల దూరంలో ఉంది. టీఆర్ఎస్ కు ఉన్న బలం 22 వేల ఓట్లు.. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ డెసిషన్ మేకర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఎవరికి మద్ధతు ఇస్తాడన్నది ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more