ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మత అసహనంపై చేసిన వ్యాఖ్యలు వెనుక ఎవరున్నారు..? రచయితలు, నటులు, కళాకారులు తమ అవార్డులను తిరిగిస్తూ.. మోడీ ప్రభుత్వంపై అవార్డ్ వాపసీ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ తరుణంలో ఆ ఉద్యమం కాస్త మెతకబడుతుందన్న తరుణంలోఅమీర్ ఖాన్ మళ్లీ ఎందుకు రగిలించారు. నిజంగా అమీర్ ఖాన్ ఎవరి ప్రేరణతో ఈ వ్యాఖ్యలు చేశారన్నది తెలియని ప్రశ్నగా మారుతుంది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ను దేశం విడిచి వెళ్లాలని కోందరు విమర్శించగా, మరెందరో ఎన్నో రకాలుగా విమర్శలు గుప్పించారు.
స్వయంగా బీజేపి కేంద్ర మంత్రి అమీర్ ఖాన్ ఎవరి ప్రేరణతోనే ఈ వ్యాఖ్యాలు చేస్తున్నారని అన్నారు. ఇక నిదానంగా స్పందించిన శివసేన నిజంగానే అమీర్ ఖాన్ ఆలాంటి వ్యాఖ్యలు చేసి వుంటూ చంపి వేస్తామన్నారు. మరోవైపు హిందుత్వ సంఘ నేతలు అమీర్ ఖాన్ ని చంపదెబ్బ కోడితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇక కోందరైతై రాజకీయాలకు కూడా అమీర్ వ్యాఖ్యలను ముడిపెట్టారు. అమీర్ ఖాన్ కాంగ్రెస్ వాది అని అందుకనే ఆలాంటి వ్యాఖ్యాలు చేశార్నన్నారు.
అయితే అమీర్ వ్యాఖ్యల వెనుక బిజేపీ నేతలే వున్నారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. సాహితీ వేత్తల అవార్డులు వెనక్కివ్వడం నుంచి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం పెరిగిపోయిందంటున్నారు, దీనికి తోడు గోమాంసం ఉదంతం దానిపై అప్పట్లో రాజుకున్న వేడి కూడా బీజేపిని ఇరకాటంలో పెట్టాయని అంటున్నారు. ఇది చాలదన్నట్లు హిందూత్వ వ్యాఖ్యల ఆ పార్టీకి చెందిన నేతలు, ఎంపీలు కూడా పార్టీ ప్రతిష్ట దిగజార్చేందుకు కారణమయ్యారని విశ్లేషకులు అంటున్నారు.
వీటన్నింటికన్నా దేశ ప్రజలకు మరో ఐదేళ్ల వరకు గుర్తిండిపోయేలా బీహార్ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరాంగనంలో ఇచ్చిన తీర్పుతో బీజేపీ ప్రతిష్ఠను మసకబార్చాయని, ఇది ఇరత రాష్ట్రలలో బీజేపి ఎదుగుదలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలలో బీజేపిని అధికారంలోకి తీసుకురావాలనుకున్న తమ కల సాకారం కాకుండా పోతుందని, ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట వాటిల్లిన అపఖ్యాతిని పక్కదారి పట్టించాలంటే.. ఏదో ఒక మంచి అంశం.. అది కూడా తమకు లాభపర్చే అంశాన్ని తెరమీదకు తీసుకురావాలని బీజేపి అగ్రనేతలు భావించారని వారన్నారు.
అందులో భాగంగానే బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ తో లోపాయికారి ఓప్పందం చేసుకునే మత అసహనానిక సంబంధించిన వ్యాఖ్యలు ఆయనతో చెప్పించి.. దేశ ప్రజలు దృష్టిని బీజేపి చాకచక్యంగా పక్కదారి పట్టించిందని విశ్లేషకులు పేర్కోంటన్నారు. అమీర్ చేసిన వ్యాఖ్యలు దేశంలోని హిందూత్వ వాదులను ఏకతాటిపైకి తెచ్చాయి. వీరంతా బీజేపీకి అండగా నిలిచారు. అమీర్ ఖాన్ మాట్లాడింది తప్పంటూ విమర్శించారు. దీంతో అప్పటి వరకు బీజేపి పైనున్న వ్యతిరేకత కాస్త పోయింది. ఇక బీహార్ ఎన్నికల ఓటమిని ప్రజలు మర్చిపోయారని ఇదంతా బీజేపి నేతలు వ్యూహాత్మక తెరవెనుక నాటకంలో భాగమని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more