ఏపిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది... అని ఎవరైనా ప్రశ్నిస్తే గుక్కతిప్పుకోకుండా ఛండాలంగా ఉందనో... అస్సలు బాగోలేదనో.. చెప్పుకోవడానికి కూడా లేనంత ఉందనో సమాధానం చెబుతారు. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన పాపంతో గత ఎన్నికల్లో కనీసం పార్టీ నుండి నిలిచేందుకు కూడా అభ్యర్థులు లేకపోవడం దయనీయ పరిస్థితి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు పర్యటించినా సభల్లో జనాలు కూడా కనిపించని పరిస్థితి. సరే గతం గతం... గడిచిపోయింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఏపి రాజధాని అమరావతి అంకురార్పణకు ముహూర్తం దగ్గర పడుతోంది. మరి అమరావతి శంఖుస్థాపనలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అనుభవం ఎదురుకానుంది.
ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన పాపం.. కాంగ్రెస్ పార్టీదే అంటూ అన్ని పక్షాలే ఏపిలో విసృతంగా ప్రచారం చేశాయి. ఇక ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు అయితే కాంగ్రెస్ పార్టీ పేరంటేనే చిర్రెత్తిపోతారు. అన్నింటికి మూలకారణం సోనియాగాంధే అంటూ ఒంటి కాలి మీద లేస్తారు. మరి అమరావతి అద్భుత ఘట్టానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను చంద్రబాబు నాయుడు పిలుస్తారా..? లేదా.? అన్నది అందరికి వస్తున్న ప్రశ్న. పైగా అందరి దృష్టి మోదీ మీద, కేసీఆర్ పైన, జగన్ ఆహ్వానం మీద ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం అందుతుందా..? అందితే మాత్రం అమరావతి శంఖుస్థాపనకు ఎవరు వెళతారు అన్నది ప్రస్తుతానికి సమాదానం లేని ప్రశ్న. అయితే చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్ట నాయకులను ఆహ్వానించడం ఇష్టం లేదని ప్రచారం సాగుతోంది. ఏపికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు, ఎవరిని కూడా ఆహ్వానించకూడదు అని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more