పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గత మూడు రోజులగా ఫ్లెక్సీల గొడవ తారా స్థాయికి చేరింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్సాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం వివాదానికి తెర తీసింది. అయితే మరో హీరో అభిమానులే తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను తొలగించారని పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉదయం పది మంది పవన్ కళ్యాణ్ అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. దాంతో వివాదం మరింత ముదిరింది. ఫ్లెక్సీలను తొలగించిన వారిని కాకుండా.. తమ మీద కేసులు పెట్టడం ఏంటని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమవరంలో ఏం జరిగింది.? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు, ప్రభాస్ ఫ్యాన్స్ కు గొడవ జరిగితే ఎవరికి లాభం..? నిజానికి భీమవరంలో ఏం జరిగింది..? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు.
బీమవరం ఘటన మీద అనుమానాలు.....
* భీమవరంలో పవన్ కళ్యాణ్ ఫెక్సీలను తొలగించాల్సిన అవసరం ఎవరికి ఉంది..? ఫ్లెక్సీలను తొలగిస్తే వారికి వచ్చే లాభం ఏంటి..?
* ప్రభాస్ ఫ్యాన్సే ఫ్లెక్సీలను తొలగించారని ఎవరు అందించారు..? ప్రభాస్ ఫ్యాన్స్ కు, పవన్ ఫ్యాన్స్ కు తగాదా రాజేస్తే లాభపడే మూడో పార్టీ ఎవరు..?
* మీడియాలో పవన్ ఫ్యాన్స్ అరెస్ట్... పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం.. అంటూ ఎందుకు వార్తలు వస్తున్నాయి..?
* పవన్ కళ్యాణ్ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్న మీడియా అసలు లక్ష్యం ఏంటి..?
* ఎలాంటి రాజకీయ లాభం లేకుండా ఇలాంటి వివాదానికి తావు తీశారా..?
* పవన్ కళ్యాణ్ లాంటి గ్రేట్ పర్సనాలిటీ మీద బురద జల్లుదామని అనుకున్నా.. అదే బురదలో కలువలా మారతారని వారికి తెలియదా..?
* పోలీసులు పవన్ కళ్యాణ్ అబిమానులనే ఎందుకు అరెస్టు చేశారు..?
* ఘటన జరిగి మూడు రోజులు గడిచిన తర్వాత తీరిగ్గా పోలీసులు పవన్ కళ్యాన్ అభిమానుల మీదే ఎందుకు కేసులు పెట్టారు..?
//అభినవచారి//
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more