గుడిని మింగిన వాడు ఒకడైతే.. గుడిని, గుడిలోని లింగాన్ని మింగిన వాడు మరోకడు.. అంటూ పెద్దలు చేప్పిన సామెత.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావును చూస్తే.. ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యాలను పరిశీలిస్తే ఇప్పుడు తప్పక గుర్తుకువస్తుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి రోజున.. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్ ఫోటోపై లేవనెత్తిన చర్చ సందర్భంగా అసెంబ్లీలో వారి విమర్శలను ఖండిస్తూ పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పర్చుకుని పథిలంగా వున్న టీడీపీ వ్యస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు స్వర్గీయ నందమూరి తారాక రామారావు ఉనికి దెబ్బతీసినందునే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపఠాన్ని అసెంబ్లీ లాంజీల్లోంచి తొలగించామని ఆయన అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పారు. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కమిటీ తీసుకుంటుందని చెప్పిన ఆయన.. శంషాబాద్ విమానాశ్రాయానికి ప్రతిపాధించిన ఎన్టీయార్ పేరును తొలగించి.. రాజీవ్ గాంధీ పేరు పెట్టారని ఆయన ప్రస్తావించారు. ఇలా అనేక విధాలుగా ఎన్టీయార్ ఖ్యాతిని మరుగున పడేట్లు చేసింది రాజశేఖర్ రెడ్డేనని విమర్శించారు.
ఇంతవరకు బాగానే వున్నా.. అసలు ఎన్టీరామారావును పదవీచ్యుతుడిని చేసింది చంద్రబాబు నాయుడన్న విషయం మాత్రం పత్తిపాటికి ఎందుకు గుర్తుకు లేదో ఆయనకే తెలియాలి. జామాతా దశమ గ్రహా: అంటూ మనోవేధనకు లోనైన ఎన్టీయార్ చెప్పిన విషయాలు కూడా పత్తిపాటికి గుర్తులేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. తన అల్లుడిపై ఆక్రోశం వ్యక్తం చేసిన ఎన్టీరామారావు.. చంద్రబాబుకు బుదులుగా తన కొడుకు హరికృష్ణను నాయకుడిగా ఎందుకొమ్మని అప్పట్లో చేసిన వినతి కూడా పత్తిపాటి విస్మరించారా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీరామారావు మనోవేధనతో ఆకస్మికంగా మృతి చెందడానికి కారణాలలో ఎవరెవరి ప్రమేయం వుందో వారికే తెలియాలి.
ఎన్టీరామారావు చివరి నిమిషంలో చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా వున్న చంద్రబాబు.. ఆ తరువాత టీడీపీ అంటే తానేనన్నట్లు మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టారు. టీడీపీలో అప్పటివరకు కనిపించిన ఎన్టీయార్ చిత్రాన్ని కూడా మరుగున పడేశారు. మళ్లీ బడికి, జన్మభూమి, చేయూత ఇలా అనేక కార్యక్రమాలు ద్వారా రాష్ట్ర ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్న చంద్రబాబు.. ఉచితంగా టోపీలను, ఇంటి తోరణాలను, కులవృత్తుల వారికి పనిముట్లను పంఫిణీ చేశారు. వాటిపై ముద్రించింది మాత్రం కేవంల చంద్రబాబు ఫోటోలే. మూడు నెలలకో పర్యాయం జన్మభూమి కార్యక్రమాలను ఏర్పాటు చేయించి మహిళలు, వితంతువులు, వికలాంగులకు, వృద్దులకు పింఛన్ ఇచ్చారు. అయితే ఎక్కడా.., ఎవరి నోట కూడా ఎన్టీరామారావు అన్న మాట వినబడకుండా చేయడంలో సఫలీకృతుడయ్యారు.
ఎన్టీరామారావు అస్తమించిన నాటి నుంచి ఆయనకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. అప్పట్లో కేంద్రంలో వున్న యూనైటెడ్ ఫ్రంట్ సహా ఆ తదనంతరం వచ్చిన నేషనల్ డెమెక్రటిక్ కూటములలో చక్రం తిప్పి.. తన పార్టీకి చెందిన ఎంపీ బాలయోగిని లోక్ సభ స్పీకర్ చేయించారు. అంతేకాదు అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయాలని అప్పటి ప్రధాన మంత్రి వాజ్ పాయ్ కి సూచించి, ప్రతిపాదించింది కూడా తానేనని చెప్పుకున్న చంద్రబాబుకు ఎన్టీరామారావుకు భారత రత్న అవార్డును ఇప్పించడం మాత్రం కష్టంగా మారిందా..? అన్న విషయం కూడా పత్తిపాటికే తెలియాలి. ఇలా ఎన్టీరామారావుకు అడుగడుగునా వ్యతిరేకంగా మారిన చంద్రబాబు.. చివరకు ఆయన కుటుంభ సభ్యులను కూడా ఎన్నికల నేపథ్యంలో వాడుకుని వదిలేశారన్న ఆరోపణలు కూడా వినవస్తున్నా వాటిపై ఎందుకు స్పందించలేదో కూడా అమాత్యులు గ్రహించాలి.
ఎన్ టి రామారావును ఉనికి దెబ్బతీసింది..? ఎవరు..? అసలు ఆయన మానసిక వేదనతో అస్తమించేందుకు కారణమైంది ఎవరు..? ఆయన ప్రజలు మర్చిపోయేలా చర్యలు తీసుకుంది ఎవరు..? ఎవరి నోట ఎన్టీయార్ పేరు వచ్చినా.. పార్టీలో ప్రాధాన్యాన్ని తగ్గించి చివరకు గుర్తింపు లేకుండా చేసింది ఎవరు..? ఎన్టీయార్ పెట్టిన పార్టీలో ఆయన చిత్రాన్నే లేకుండా చేసి.. గత్యంతరం లేని పరిస్థితులలో మళ్లీ ఆయన బొమ్మను ముద్రించినది ఎవరు..? ఇన్ని చేసిన వాడు గుడినే కాదు.. గుడిలోని లింగాన్ని కూడా మింగినట్టే కదా..? మరి గుడిని గుడిలోని లింగాన్ని మించిన వ్యక్తి పంచన చేరి.. మోకాలికి బొడిగుండుకీ లెంకపెట్టినట్టు.. శంషాబాద్ విమానాశ్రయానికి.. ఎన్టీరామారావు పేరుతో ముడిపెట్టి.. వెఎస్ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమో పత్తిపాటికే తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more