లలిత్ మోడీ అంశానికి సంబంధించి.. కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందరా రాజేలు సహకరించారన్న అంశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నా.. ఈ అంశంలో తనకేమీ పట్టనట్టు ప్రధాని మోడీ వ్యవహరించడం.. వ్యూహాత్మకమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సరిగ్గా 15 మాసాల క్రితం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఈ అంశాన్ని కూడా తన ప్రసంగంలో చేర్చి మరీ దేశప్రజలను తన వైపుకు తిప్పుకున్నారు.
పార్లమెంటులో సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయని, ప్రతిపక్షాల అడిగిన అంశాలపై అధికార పక్షం చర్చకు అనుమతించక పోవడంతో ప్రజాధనం వృధా అవుతోందని, అలాంటి చర్యలకు తాము పాల్పడమని చెప్పుకోచ్చారు. ప్రతిపక్షాల డిమాండ్లపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఆయన మన్మోహన్ సింగ్ కాదు.. మౌన్ మోహన్ సింగ్ అంటూ వ్యంగస్త్రాలను సంధించారు. తాము అధికారంలోకి వస్తే.. పార్లమెంటు సమావేశాల నిర్వహణ, ప్రతిపక్షాల డిమాండ్లకు కూడా సమాధానం ఇస్తామని నమ్మబలికారు.
అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీన్ రివర్స్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా మౌన ముద్రలోకి జారుకున్నారు. వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్షాలు అడగుతున్న లలిత్ గేట్ అంశంలో వివరణ ఇవ్వడానికి సంశయంలో పడ్డారు. తన క్యాబినెట్ కి చెందిన మంత్రితో సహా, తాను ప్రతిపాదించిన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేలను.. విపక్షాల డిమాండ్ల మేరకు పదవులను నుంచి తప్పించాలా..? లేదా..? అన్న అంశంలో ఆయన స్టాండ్ క్లియర్ గానే వుందన్న సంకేతాలు వస్తున్నాయి.
ప్రతిపక్షాల డిమాండ్లకు తలొగ్గి వసుందర రాజే, సుష్మాస్వరాజ్ లను పదవునుంచి తొలగిస్తే.. తన ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడిందని అంగీకరించినట్లు అవుతుందని, ఈ అంశాన్ని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే.. పార్టీ ఉనికే ప్రమాదం వస్తుందని భావిస్తున్నారని తెలుస్తుంది. అయితే ప్రతిపక్షాలు రోజురోజుకు తమ డిమాండ్ ఉదృతం చేస్తూ.. మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, సహా రాహుల్ గాంధీ, ప్రతిపక్షాలకు చెందిన తొమ్మిది పార్టీలు ఏకమై ఐక్యంగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి.
అయినా ప్రధాని నరేంద్రమోడీ స్పందించడం లేదు. వర్షాకాల సమావేశాల వృధగా అవుతున్నాయి. ప్రతినిత్యం వాయిదాల పర్వం కోనసాగుతోంది. అయినా ప్రధాని తన మౌనాన్ని వీడటం లేదు. అయితే అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలకే వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సమరశంఖం పూరించక ముందే తనకు అనుకూలంగా పావులు కదపాలని రంగంలోకి దిగిన బిజేపి ఎంపీ సాధ్వీ ప్రాచీ.. ఓటర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతలా ప్రచారం చేసినా.. బీజేపికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం మూడు సీట్లు మాత్రమే లభించాయి.
ఈ విషయాన్ని పక్కన బెడితే ఆ తరువాత వచ్చిన పార్లమెంటు సమావేశాలో సాధ్వీ ప్రాచీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు సభా సమావేశాలను అడ్డుకున్నాయి. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ సభకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బీజేపి ఎంపీ స్వాధీ ప్రాఛీ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు నిండు కోలువులో ప్రధాని వివరణ ఇచ్చారు. అమె కుగ్రామం నుంచి వచ్చిన నేతని, సమాజంలో ఎలా వ్యవహరించాలో తెలియదని అమెను వెనకేసుకోచ్చారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని విపక్షాలకు విన్నవించారు. దీంతో ఆ అంశం అక్కడితో వదిలేశాయి ప్రతిపక్షాలు.
అయితే అది దేశీయ సమస్య. ఓ బిజేపి ఎంపీ ఢిల్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు. చిన్న సమస్యే. అయినా దానిపై ప్రధాని వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజేతో ముడిపడిన లలిత్ గేట్ అంశంపై ప్రధాని మౌనం వెనుక అంతరార్థం అర్థంకావడం లేదు. లలిత్ మోడీ ఒక ఆర్థిక నేరగాడు, నిధుల మళ్లింపు కేసులో నిందితుడు, నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలను ఎదుర్కోంటున్న ఓ నిందితుడు. భారత్ కు వస్తే తనకు ప్రాణభయం వుందని ఇన్నాళ్లు బుకాయిస్తూ..లండన్ లో దాకున్నాడు.
అంతేకాదు తనకు సుష్మాస్వరాజ్, వసుందర రాజేలు సహకరించారన్న నేపథ్యంలో వారికి మద్దతుగా లండన్ నుంచి ప్రతిపక్షాలపై అరోపణలు గుప్పించిన వాడు.. అంతేకాదు క్రికెటర్ల పరుపును కూడా బజార్లకు ఈడ్చిన వాడు, దీంతో పాటు ఇది దేశాలకు, విదేశాలకు వున్న సంబంధ్య బాంధవ్యాలపై కూడా ప్రభావం చేపే అంశం. అలాంటి లలిత్ మోడీ అంశానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ ఇంకా మౌనం వహించడం సబబు కాదు. ఇంకా ఎన్నాళ్ల పాటు ఆ ఈ అంశంలో మౌనంగా వుంటారో వేచి చూడాల్సింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more