బీజేపి పార్టీలో ప్రధాని నరేంద్రమోడీ తరువాత అదే స్థాయిలో.. విపక్షాలను ధాటిగా ఎదుర్కోంటూ ముందుకు సాగుతన్నఆయన మంత్రివర్గ సహచరుల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒకరు. ఇప్పటికే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన సొంత నియోజకవర్గం అమేధీలోనే టర్గెట్ చేసి విమర్శల పర్వాన్ని రుచిచూపించారు. అమేధీలో రాహుల్ చేతిలో ఓటమి పాలైన స్మృతి ఇరానీ.. మోడీ సర్కారు తీసుకువస్తున్న భూ సేకరణ చట్టంలోని సవరణలతో దేశ రైతాంగానికి ఎనలేని నష్టం కలుగుతుందని ప్రచారం చేస్తున్న క్రమంలో స్మృతి రాహుల్ ను టార్గెట్ చేశారన్న విమర్శలు వినబడుతున్నాయి.
ఇటీవల వరుసగా అమేథీలో పర్యటించిన అమె.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ తనపై విమర్శలను కూడా సమర్థవంతంగా తిప్పికోట్టారు. కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ నాయకత్వ లోపం గురించి బాగా తెలుసేమోనని, అందుకే ఆయన తన సొంత గడ్డ మీద తనను తాను రక్షించుకోలేక.. అదనపు ఆయుధాలుగా చెల్లెలు ప్రియాంకను తెచ్చుకున్నారని అమె విమర్శించారు. అంతేకాదు అమేథీలో గెలిచిన అభ్యర్థి రాహుల్ గాంధీని పక్కన బెట్టి.. అదే స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తనను ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా అడుగుతున్నారని, ఇదెక్కడి విడ్డూరమని కేంద్రమానవ వనరుల శాఖ మంత్రి విస్మయం వ్యక్తం చేశారు.
ఇంతవరకు బాగానే వున్నా.. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం అమెపై విమర్శల దాడి ఎక్కుపెడుతున్నారు. స్మృతి ఇరానీ.. కేంద్ర మంత్రినన్న విషయాన్ని మర్చిపోతున్నారని, అమె కేవలం అమేధీకే మంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినబడుతున్నాయి. దేశంలో అత్యంత కీలక శాఖైన కేంద్ర మానవ వనరుల శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమె.. దేశంలో మానవ వనరులు అభివృద్ది చర్యలు తీసుకోవాలని.. అ విషయాన్ని మర్చి అమేధీలో ఎలా గెలుద్దామా..? అన్న కోణంలోనే తన అలోచనలు వున్నాయంటున్నారు. అమేధీపైనున్న శ్రద్ద మానవ వనరుల అభివృద్దిలో చూపాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.
ప్రస్తుతం కేంద్రంలో వున్న ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నందున స్మృతి ఇరానీ అక్కడి ప్రజలు అభివృద్ది చేయాల్సిందిగా కోరడంలో అమె అంతగా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదని కాంగ్రెస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రమంత్రిగా కాకుండా ఓటమి పాలైన హోదాలో స్మృతి ఇరానీ వస్తే.. ఎందురు అమె పర్యటనకు కదులుతారో అమె అంచానాకు కూడా రాదన్నారు. మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా రాహుల్ ప్రచారం చేయడంతోనే.. అమె అమేధీలో పర్యటిస్తుంది తప్ప.. అమేదీ ప్రజలపై నిజమైన ప్రేమతో కాదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇక మరోవైపు మద్రాసు యూనివర్శిటీలో అంబేద్కర్ పెరియార్ స్టూడెంట్ సర్కిల్ రద్దు విషయమై దేశవ్యాప్తంగా నిరసన సెగలు అలుముకుంటుంటే.. దానిపై స్పందించని మంత్రి.. ఎంతసేపు తాను మంత్రి నన్న విసయాన్ని మర్చి.. కేవలం రాజకీయ నాయకురాలుగానే వ్యవహరిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more