చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ ఒక్కటే.. అయితే అధిక స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో వారు అధికారికంగా రాష్ట్రాన్ని పాలించే హక్కును కలిగివుంటారన్నది జగమెరిగిన సత్యం. కానీ ప్రస్తుతం ఏ అధికార పార్టీని చూసిన ఏమున్నది గర్వకారణం.. పార్టీ ఫిరాయింపుల పర్వం.. నియోజకవర్గాల అభివృద్ది మంత్రం అన్నట్లుగా ప్రస్తుతం సాగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలకు చెందిన పార్టీ నేతలు.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యానికి ముందు ఏడు మంది టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ తీర్ధాన్ని పుచ్చుకుని గులాబి కండువా కప్పుకోగా.. ఎమ్మెల్సీ ఎన్నికకు రెండు రోజుల ముందు.. కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గులాబి కండువా వేసుకుని కారులో ప్రయాణించారు. అయితే తనకు రాజకీయ బిక్ష పెట్టిన చంద్రబాబుకు తాను ఇప్పటికీ కృతజ్ఞుడినేనని.. ఆయనకు ఇప్పటికీ పాదాబివందనం చేస్తానని చెప్పిన మాదవరం కృష్ణారావు.. కేవలం నియోజకవర్గ అభివృద్ది కోసమే తాను పార్టీ ఫిరాయింపుకు పాల్పడినట్టు చెప్పకోచ్చారు.
అంటే తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రభుత్వం నియోజక అభివృద్ది కోసం నిధులను కేటాయిస్తుందా..? చట్టసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలందరిని ఒక మాదిరిగా కాకుండా అయిన వారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్న చందంగా.. తమ పార్టీకి చెందిన నేతలకు అభివృద్ది నిధులు ఒకలా.. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలకు అభివృద్ది నిధులు మరోలా కేటాయిస్తున్నారా..? అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అభివృద్ది నిధులను అందరు ఎమ్మెల్యేలకు ఒకే మాదిరిగా కేటాయిస్తామని, రాష్ట్ర అభివృద్దిలో ఏ ప్రాంతానికో, ఏ పక్షానికో, ఏ వర్గానికో పక్షపాతంగా వ్యవహరించమని ప్రమాణాలు చేసినా.. ఇంకా ఆ పక్షపాతం కోనసాగుతుందా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
నియోజకవర్గం అభివృద్ది కోసమే తాను పార్టీ ఫిరాయించినట్లు అంగీకరించిన మాదవరం కృష్ణారావు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుంటే.. అసలు ప్రతిఫక్షాలు మనుగడ సాగించడమే కష్టమని చెప్పాలి. చట్టసభకు ఎన్నికైన నేతలందరూ ముందుగా తమ నియోజకవర్గాల అభివృద్దికే ప్రాధాన్యతను ఇస్తారు. రాష్ట్రం నుంచి నిధులను మంజూరు చేయించుకుని అభివృద్ది పనులు చేపడతారు. మరి ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన పార్టీలోకే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు వెళ్లి.. వార్వారి నియోజకవర్గాలను అభివృద్ది చేసుకోవాల్సి వుంటుంది. సరే పార్టీ ఫిరాయించడానికి మాదవరం కృష్ణారావు చెప్పిన మాట్లలో వాస్తవమెంతో ఆయనకే తెలియాలి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more