టీడీపీ యువనేత, న్యవాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు.. ఆర్థికంగా చతికిలబడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. తాను చదువుకున్న కాలేజ్ కు సంబంధించి మిత్రులలో అనేక మందిని కలసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అభ్యర్థించనున్నారు. ఇందుకోసం ఆయన అమెరికా పర్యటన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా తన అమెరికా పర్యటన ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడే మరో విషయం ఏమిటంటే.. ఈ నెల 5న మరో చంద్రుడు.. అదేనండీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తనయుడు కల్వకుంట తారకరామారావు కూడా అమెరికా పర్యటన చేయనున్నారు. ఇద్దరు ఒకే సమయంలో ఒకటి రెండు రోజులు అటుఇటుగా అగ్రరాజ్యంలో పర్యటనకు సిద్దమయ్యారు.
ఇక్కడ నువ్వా- నేనా అంటూ పోటీ పడుతూ తెలంగాణ, ఆంద్ర రాష్ట్ర ప్రజల మధ్య వైరుధ్యాలను పెంచుతున్న ఇద్దరు చంద్రుల తనయులు.. అక్కడ ఎవరూ చూడని ప్రాంతంలో వారి స్నేహాన్ని కోనసాగిస్తున్నారా..? అన్న సందేహాలు తెలుగు రాష్ట్ర ప్రజలలో ఉదయిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం మహోద్యమంగా సాగుతున్న క్రమంలో ప్రత్యేకవాదులుగా ముద్రపడిన తారకరామారావు.. సమైక్యవాదులకు ముఖ్యనేతగా కోనసాగిన మాజీ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో కలసి ఉత్తరభారతలో ఓ పవర్ ప్లాంట్ సంస్థలో పెట్టుబడులు పెట్టారన్న వార్తలు అప్పట్లో గుప్పమన్నాయి.
ఈ విషయాన్ని తేల్చాలని అప్పట్లో పలువుతు తెలంగాణ కాంగ్రెస్ నేతలు స్వయంగా కేటీఆర్ ను ప్రశ్నించారు కూడా. అయితే మౌనమే నా బాష ఓ మూగ మనసా అన్న పాటను అలపించిన కేటీఆర్.. దానిపై స్పందించనే లేదు. అయితే ఇద్దరు నేతలు మాత్రం బాహాటంగా తిట్ల దండకం అందుకుని పోటీ పడ్డారు. దీంతో ఇప్పుడు కూడా అలాంటి వ్యవహారమే ఏమైనా కేటీఆర్, లోకేష్ మధ్య నడుస్తుందా అన్న అనుమానాలు తెలుగు ప్రజలకు కలుగుతున్నాయి. ఇద్దరు అమెరికాలోనే చదవడం.. ఒకే సారి అగ్రరాజ్యానికి ప్రయాణం కావడం కూడా ఈ అనుమానాలకు తావిస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more