కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ లాంగ్ గ్యాప్ తరువాత ఢిల్లీ తిరిగి వచ్చారు. అలా వచ్చీ రాగానే మోదీ ప్రభుత్వంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. మోదీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే రాహుల్ తిరిగి వచ్చాకా చాలా మార్పు వచ్చింది.. అది అందరికి కనిపిస్తోంది కూడా. అయితే రాహుల్ లో ఓ మార్పు మాత్రం జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ నుండి తీసుకున్నారని గుసగుస వినిపిస్తోంది. ఏంటీ రాహుల్ గాంధీ పవన్ కళ్యాణ్ ను ఎందుకు ఫాలో చేస్తారు.. అసలు పవన్ కళ్యాణ్ ను ఏ విషయంలో ఫాలోఅవుతున్నారు. ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడండి.
రైతుల ఆత్మహత్యలు, వారు ఎదుర్కొంటున్న కష్టాలపై రాహుల్ గాంధీ స్పందించారు. విదేశాల నుండి వచ్చీ రాగానే రైతులతో సమావేశమై, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేనా పార్లమెంట్ లో మోదీ ప్రభుత్వంపై చురకత్తులు దూసారు. అలా రైతుల గురించి మాట్లాడటంతోనే పరిపెట్టకుండా రైతుల వద్దకే రాహుల్ వెళ్లి వారి సమస్యలను సావదానంగా విన్నారు. మహారాష్ట్రలోని విదర్భ ఏరియా అమరావతి జిల్లాలో రాహుల్ నిర్వహించిన 15 కిలోమీటర్ల పాదయాత్ర అచ్చం పవన్ కళ్యాణ్ తూళ్లూరు యాత్ర లాగేనే అనిపించింది. అవును పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే రైతుల వద్దకు వెళ్లి సమస్యలను విన్నారో అదే విధంగా రాహుల్ కూడా రైతుల సమస్యలను విన్నారు. ఇప్పుడు ఇదే పోలీకను చూపుతూ రాహుల్ గాంధీ పవన్ ను ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఇంత చెబుతున్నా మీకు నమ్మశక్యంగా అనిపించడం లేదా అయితే ఈ ఫోటోలపై ఓ లుక్ వెయ్యండి.
పవన్ కళ్యాన్ తూళ్లూరు పర్యటనలో భాగంగా ఎలా అయితే నేల మీద కూర్చొని రైతుల సమస్యలను విన్నారో అదే విధంగా రాహుల్ కూడా నేల మీద రైతుల మధ్య కూర్చొని వారి సమస్యలను విన్నారు. మరి ఇంతలా పవన్ ను ఫాలో అవుతున్న రాహుల్ భవిష్యత్ లో ఇంకా ఎన్ని పాఠాలు పవన్ నుండి నేర్చుకుంటారో చూడాలని కొందరు అనుకుంటున్నారట.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more