ఉన్న రెడ్డికంటే .. వెళ్లిన రెడ్డే చాలా బెటర్ అని ఆ పార్టీ నేతలు బాధలు చెప్పుకొని ఏడుస్తున్నారు. ఉన్న రెడ్డిలో అసలు విషయం లేదట. వెళ్లిన రెడ్డిలో తన వారికి, చాలా ఉపయోగపడినట్లు చెయ్యి గుర్తు నేతులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు ఇంతకీ విషయం
ఏమిటంటే..!!! రాష్ట్ర విభజనతో సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాలిపోయి, సమాధులు మిగిలిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని .. చివరి వరకు పోరాటం చేసిన పీలేరు పిల్లాగాడు.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పచ్చి సమైక్యవాదిగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడి, పదవి రాజీనామ చేసి, ఇంట్లో ఖాళీ న్యూస్ పేపర్ చదువుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు సీమాంద్రలోని కాంగ్రెస్ నేతలు .. కిరణ్ కుమార్ రెడ్డికే జై అంటూ, ఆయన నాయకత్వం కోరుకుంటున్నారు. ఆయన ఉన్నప్పడే చాలా బాగుందని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న రఘువీర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిపోయిందని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీమాంద్రలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కించుకోలేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అయోమయంలో పడిపోయింది. అసలే ఓటమి దెబ్బతో కుమిలిపోతున్న కాంగ్రెస్ నేతలకు కొత్త పోటు మొదలైంది.
రాష్టవ్యాప్తంగా 650కు పైగా మండలాలుంటే.. కనీసం ఒక్కటంటే ఒక్క మండల పరిషత్ కూడా సీమాంద్ర కాంగ్రెస్ ఫార్టీ గెలుచుకోలేక పోయింది. రెండు మూడు చోట్లో గెలిచిన . అది కేవలం టీడీపీ సహకరంతోనే విజయం సాధించినట్లు తెలుస్తోంది. సీమాంద్రలో వైసీపీ కి మున్సిపాలిటి దక్కకూడదనే ఉద్దేశంతోనే టిడిపి కాంగ్రెస్ కు పూర్తి సహకరం అందించి విజయం చేకూర్చింది.
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే.. జై సమైక్యాంద్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి చాలా బెటర్ అని అంటారు. ఎందుకంటే.. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి చిత్తూరు జిల్లాలో రెండు మండల పరిషత్ ను గెలుచుకుంది. వంద సంవత్సరాలు దాటిన పార్టీ కంటే కొత్తగా పెట్టిన జై సమైక్యాంద్ర పార్టీ బెటర్ అని సీమాంద్ర కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. సీమాంద్ర కాంగ్రెస్ పార్టీలో కొమ్ములు తిరిగిన నేతలు చాలా మంది ఉన్నప్పటికి.. రాష్ట్రంలో ఒక్క మండలంలాన్ని కూడా గెలిపించుకోపోవటంతో ఢిల్లీలో పెద్దల మద్య భారీ ఎత్తున చర్చలు జరిగినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. ఉన్న రెడ్డి కంటే ..వెళ్లిన రెడ్డే చాలా బెటర్ అన్ని అన్నట్లు సీమాంద్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more