Congress party leaders discuss to ex cm kiran

congress party leaders discuss to ex cm kiran, ex cm kiran kumar reddy, congress party, ap state division, andhra pradesh, raghuveera reddy, congress high command

congress party leaders discuss to ex cm kiran

ఉన్న రెడ్డి కంటే వెళ్లిన రెడ్డే బెటర్!

Posted: 07/05/2014 03:10 PM IST
Congress party leaders discuss to ex cm kiran

ఉన్న రెడ్డికంటే .. వెళ్లిన రెడ్డే చాలా బెటర్ అని  ఆ పార్టీ నేతలు బాధలు చెప్పుకొని ఏడుస్తున్నారు. ఉన్న రెడ్డిలో అసలు విషయం లేదట. వెళ్లిన రెడ్డిలో తన వారికి, చాలా ఉపయోగపడినట్లు  చెయ్యి గుర్తు నేతులు గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు ఇంతకీ విషయం

ఏమిటంటే..!!! రాష్ట్ర విభజనతో సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాలిపోయి, సమాధులు మిగిలిన విషయం  అందరికి తెలిసిందే.   రాష్ట్ర విభజన సమయంలో.. రాష్ట్రాన్ని  సమైక్యంగా ఉంచాలని .. చివరి వరకు పోరాటం చేసిన  పీలేరు పిల్లాగాడు.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి  పచ్చి సమైక్యవాదిగా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో పడి, పదవి రాజీనామ చేసి, ఇంట్లో  ఖాళీ న్యూస్  పేపర్ చదువుతున్న విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు  సీమాంద్రలోని  కాంగ్రెస్ నేతలు .. కిరణ్ కుమార్ రెడ్డికే  జై అంటూ, ఆయన నాయకత్వం కోరుకుంటున్నారు.  ఆయన ఉన్నప్పడే చాలా బాగుందని సీమాంద్ర కాంగ్రెస్ నేతలు  అంటున్నారు.  అయితే  ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న రఘువీర రెడ్డి  వల్ల   కాంగ్రెస్ పార్టీకి  నష్టం  జరిగిపోయిందని  సీమాంద్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు.   సీమాంద్రలో ఒక్క ఎమ్మెల్యే  సీటు కూడా  దక్కించుకోలేదు. దీంతో  కాంగ్రెస్ హైకమాండ్ అయోమయంలో పడిపోయింది.  అసలే  ఓటమి దెబ్బతో కుమిలిపోతున్న  కాంగ్రెస్ నేతలకు కొత్త  పోటు మొదలైంది.

రాష్టవ్యాప్తంగా 650కు పైగా మండలాలుంటే.. కనీసం ఒక్కటంటే ఒక్క మండల పరిషత్ కూడా సీమాంద్ర కాంగ్రెస్ ఫార్టీ గెలుచుకోలేక పోయింది.  రెండు మూడు చోట్లో  గెలిచిన . అది కేవలం  టీడీపీ సహకరంతోనే విజయం సాధించినట్లు తెలుస్తోంది.  సీమాంద్రలో  వైసీపీ కి మున్సిపాలిటి దక్కకూడదనే ఉద్దేశంతోనే టిడిపి కాంగ్రెస్ కు పూర్తి సహకరం అందించి  విజయం చేకూర్చింది.

ఇప్పుడు రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ కంటే.. జై సమైక్యాంద్ర పార్టీ అధినేత   కిరణ్ కుమార్ రెడ్డి చాలా బెటర్  అని అంటారు.  ఎందుకంటే..  కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి  చిత్తూరు జిల్లాలో  రెండు  మండల పరిషత్ ను  గెలుచుకుంది.  వంద సంవత్సరాలు దాటిన  పార్టీ  కంటే కొత్తగా పెట్టిన  జై సమైక్యాంద్ర పార్టీ బెటర్ అని  సీమాంద్ర కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు.  సీమాంద్ర కాంగ్రెస్ పార్టీలో  కొమ్ములు తిరిగిన నేతలు  చాలా మంది ఉన్నప్పటికి..  రాష్ట్రంలో  ఒక్క మండలంలాన్ని  కూడా గెలిపించుకోపోవటంతో  ఢిల్లీలో పెద్దల మద్య భారీ ఎత్తున చర్చలు జరిగినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. ఉన్న రెడ్డి కంటే ..వెళ్లిన రెడ్డే  చాలా బెటర్ అన్ని అన్నట్లు  సీమాంద్ర  కాంగ్రెస్ పార్టీలోని  సీనియర్ నేతలు  గుసగుసలాడుకుంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles