భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలు పొత్తులతో ఎన్నికలలో ముందుకెళ్తాయని ఆశపడి భాజపాలో చేరిన నాయకులకు ఆ పొత్తు ఒప్పందాలు కుదరక పోవటంతో ప్రతిరోజు ఉత్కంఠతో ఎదురు చూడటం, నిరాశ చెందటం జరుగుతోంది.
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ లాగానే ఉంది భాజపా పరిస్థితి కూడా. అందువలన తెదేపాతో పొత్తు ఉంటేనే గెలవటం సాధ్యమౌతుంది కాబట్టి కొత్తగా భాజపాలో చేరిన నాయకులు మనస్తాపం చెందుతున్నట్టుగా కనిపిస్తున్నారు. తెదేపాతో పొత్తు ఉంటుందని నమ్మి ఎన్నికల కోసం ఇప్పటికే ఖర్చుపెట్టిన కొందరు నాయకులు భాజపా అధిష్టానానికి పొత్తు పెట్టుకోమని కోరుతూ వివిధ నాయకులతో సంప్రదింపులు చేస్తున్నారు. భాజపా ఎక్కువ సీట్లను అడగటం వలనే సమస్య తలెత్తుతోందని అంటున్నారు. భాజపాలోకి వచ్చి చేరే నాయకులనుబట్టి వారందిరినీ సంతృప్తి పరచటానికి ఎక్కువ సీట్లు అడిగే పక్షంలో తెదేపా అందుకు సిద్ధంగా లేదు. పైగా భాజపా వ్యాఖ్యలతో తెదేపా మనసు నొప్పించినట్లుగా కూడా కనపడుతోంది.
తెదేపా తప్ప రాష్ట్రంలో భాజపాతో పొత్తుకి ఏ పార్టీ ముందుకొస్తోంది. మిగతా పార్టీలు ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆలోచిస్తామంటున్నాయి కానీ తెదేపా మాత్రమే ఈవిషయంలో ముందుగా ముందుకొచ్చిందంటూ తెదేపా నాయకులు అంటున్నారు. ఇక్కడ స్థానికంగా నెలకొన్న వాతావరణంలో ఏ విధంగా సీట్ల ఎడ్జెస్ట్ మెంట్లు చేసి ఎక్కడ భాజపాకి ఇవ్వాలన్న విషయాన్ని శోధించి శాస్త్రీయంగా ఆలోచించి తెదేపా చెప్తుంటే కాదు మాకు ఇన్ని కావాలి, ఇక్కడ కావాలి అంటూ భాజపా కోరటం సరికాదని తెదేపా నాయకులు, భాజపాలో చేరిన నాయకులు కూడా భావిస్తున్నారు.
తెలంగాణాలో చూసుకున్నా, ఉద్యమం బాగా ఊపందుకుని ఉన్న సమయంలో కూడా తెదేపా వరంగల్ జిల్లా పరకాలలో ముప్ఫైవేల వోట్లకు పైగా మెజారిటీ సంపాదించిందని తెదేపా నాయకులంటున్నారు.
అయితే పొత్తు విషయంలో ఇంకా చర్చలు సాగుతూనేవున్నాయి. పూర్తిగా తలుపులు మూసుకుపోలేదు కాబట్టి భాజపా నాయకులు మిణుకుమిణుకుమంటున్న చిన్న ఆశను ఇంకా కాపాడుకుంటూనేవున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more