అతి తక్కువ సమయంలో.. టన్నుల కొద్ది ఇమేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ నటుడు ఒక్క బర్నింగ్ స్టార్. బహుశ బర్నింగ్ స్టార్ అంటే అందరికి తెలియకపోవచ్చు.. సంపూ బాబు అందరికి తెలుస్తుంది. సంపూ బాబు నటించిన సినిమా ‘హృదయ కాలేయం’ విడుదలకు సిద్దంగా ఉంది.
సంపూ బాబు సినిమా గురించి ప్రమఖ దర్శకుడు రాజమౌళి లాంటి సైతం ముచ్చటపడి ముద్దు ముద్దుగా ట్విట్ చేయటం జరిగింది. ఇక తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి సైతం పొగడ్తలతో ముంచిన విషయం తెలిసిందే.
ఇప్పడు టాలీవుడ్ లో మోడీ పవనాలు బాగా వీస్తున్నాయి. అందుకే టాలీవుడ్ నటులు, పెద్దలు మోడీ జపం చేస్తున్నారు. అందరు మోడీ జపం చేస్తున్నారు.. నేను సైతం అని సంపూ బాబు మోడీతో భేటీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇటీవల పవన్ కళ్యాణ్ బాటలో అక్కినేని నాగార్జున, ఇలా అనేక మంది మోడీని కలిసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు అదే బాటలో సంపూబాబు నమోతో కాసేపు సమావేశమై, గుజరాత్లోని ఆదర్శ గ్రామాల్ని పర్యటించి.. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడి హైదరాబాద్ వచ్చేస్తాడని టాలీవుడ్ టాక్ నడుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సంపూ బాబు ఫ్యాన్స్ మోడీతో సంపూ బాబు అనే ప్లేక్సీలు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు.
ఇంటర్నెట్తో అనుబంధమున్న ప్రతీ ఒక్కరికీ సంపూబాబు స్టఫ్ ఏమిటో తెలుసు. అలాగే ఇంటర్నెట్ సంబంధం ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ తెలుసు. అదే సంపూ బాబు ప్లస్ పాయింట్ అయింది. తొలి సినిమాతోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులేర్పడ్డారు.
అందుకే ఆయన నరేంద్రమోడీతో సమావేశమై... తన మద్దతు తెలియజేసే అవకాశముందని సంపూబాబు అభిమాన వర్గాలు చెబుతున్నాయి. ఏమైన సంపూ బాబు మంచి నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ లోని కొంత మంది పెద్దోళ్లు సంపూ బాబు పూర్తి మద్దతు తెలుపుతున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more