తెలంగాణ మాయల మాంత్రికుడు ఎవరు అంటే..? పుష్కర కాలం నుండి .. తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసిఆర్). అస్త్రవిధ్యలు నేర్చిన.. రాజకీయ పండితుడు. అపర మేథాచాణుక్యుడు. కంటి చూపుతోనే కంత్రి చేయగల నేర్పరి.
కేసిఆర్ ప్లాన్ వేస్తే చాలు.. అది చంద్రబాబు అయినా, ఇటు జగనైనా తెలంగాణ గాలికి వణికిపోవాల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్రాం ఏర్పాడుతున్న సమయంలో కేసిఆర్ కొత్త ప్లాన్ అమలు పరిచినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం వస్తే.. మొదటిగా ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి? అనే విషయం గతంలోనే క్లారిటీ గా చెప్పటం జరిగింది.
కానీ ఇప్పుడు అలా కాదు.. తెలంగాణ రాష్ట్రం వస్తే.. మొదటి ముఖ్యమంత్రి నా కొడుకు కేటిఆరే ఉండాలి. ఇది కేసిఆర్ శిలాశాసనం. ఒకవేళ తెలంగాణ రాకపోతే.. పరిస్థితి ఏమిటి అనే అనుమానం అందరికి రావచ్చు? కానీ దానీకి కేసిఆర్ మరో ప్లాన్ రేడీ గా ఉంది.
సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. తమ పార్టీద్వారా 100 మంది ఎమ్మెల్యేల 15 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రం పేరుతో గెలిపించుకోని, సమైక్య రాష్ట్రానికి సిఎం కావాలనేదే.. కేసిఆర్ రెండో ప్లాన్. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన, చెయ్యకపోయిన.. కేసిఆర్ ప్లాన్ మాత్రం ఇదేనని కొంత రాజకీయ మేథావులు అంటున్నారు.
తమ పార్టీలోని నాయకులను.. ఇప్పటి నుండి రెఢీ చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ వినోద్ తెలంగాణ బిల్లు పెట్టలేదనే సంకేతాలను తెలంగాణ ప్రజలకు మీడియా ద్వారా చెబుతున్నాడు.
ఒక పక్క అధికారపార్టీ మంత్రి షిండే, స్పీకర్ మీరాకుమారి, పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి కమల్ నాథ్ తెలంగాణ బిల్లు పెట్టేమని చెబుతుంది. కేసిఆర్, ఆ పార్టీ ఎంపీలు తెలంగాణ బిల్లు పెట్టలేదని అంటున్నారు.
ఇప్పుడు తెలంగాణ రాదు..ఎన్నికల తరువాతే అనే సంకేతాలను.. తెలంగాణ ప్రజల్లోకి టీఆర్ఎస్ నేతలు పంపుతున్నారు. రీసెంట్ .. కేసిఆర్ కొడుకు కేటీఆర్ ను.. కాంగ్రెస్ హైకమాండ్ సోనియాగాంధీ వద్ద తీసుకువెళ్లి.. తన మనసులోని కోరికలను బయటపెట్టినట్లు తెలుస్తోంది.
తెలంగాణ వస్తే కొడుకు కేటిఆర్ ముఖ్యమంత్రి.. ఒకవేళ రాకపోతే.. సమైక్యరాష్ట్రానికి .. కేసిఆర్ ముఖ్యమంత్రి. ఎటుచూసిన .. కేసిఆర్ కుటుంబానికే లాభం. ‘‘కిందపడినే పైచెయి నాదే ’’ అనే విధంగా కేసిఆర్ తెలంగాణ పై రచించినట్లు రాజకీయ మేథావులు అంటున్నారు.
‘‘తెలివిగల రైతు కాబట్టే.. ఒక ఎకరానికి ..కోటిరూపాయల లాభం పొంది రైతుగా పేరు తెచ్చుకున్నారని తెలుగుదేశం పార్టీ , వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే ’’. కేసిఆర్ వేసిన ప్లాన్ అదుర్స్ అని.. ఆయన చంక సన్నిహితులుఅంటున్నారు.
అందుకే..కేసిఆర్ తనకు అనుకూలంగా ఉన్న నాయకులనే..పార్టీలో ఉంచుకుంటున్నారు. అయినాదానికి, కానీ దానికి గోల చేసే.. కే.కేశవరావు (కేకే) రాజ్యసభకు పంపించారు. ఆత్మీయతకు మేమే అనురాగం అని చెప్పుకున్న చెల్లెమ్మను .. పార్టీ నుండి సష్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక మిలిగింది.. తెలంగాణ తెల్ల పులి ..హరిష్ రావు. ఇప్పటి వరకు మామకు ఎదురుతిరిగిన సంఘటనలు లేవు. కానీ.. అసంత్రుప్తిగా ఉన్నాడనే విషయం అప్పడప్పుడు బయటపడుతుంది. ఎంతైన మేనమామ కాబట్టి, హరీశ్ రావు సర్థుకుపోతాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కేటీఆర్, కేసిఆర్ ముఖ్యమంత్రి అయితే.. హరీశ్ రావు కు హోంశాఖ ఇచ్చిన ఆశ్చర్యం లేదని రాజకీయ మేథావులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more