ప్రజాస్వామ్యం గురించి పేజీలు పేజీలు, పేపర్ మీడియా వారు, గంటలు గంటలు ఎలక్ట్రానిక్ మీడియా వారు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే.. భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అభిమానం, గౌరవం ఉంటాయి.
ఎవరు కావాలని, తమ దేశం పరువును, తమ జాతి పరువున, తమ ఇంటి పరువును బజారుపాలు చేయ్యరు. మొన్న పార్లమెంట్ లో జరిగిన ‘పెప్పెర్ ’ ప్రయోగం ప్రపంచ దేశాలు దుమ్మెత్తి పోస్తున్నాయని జాతీయ మీడియా చక్కలు కొట్టుకోని చెబుతుంది.
అసలు మనదేశం పరువు ఎవరు తీశారు? సీమాంద్ర ఎంపీలా? కాంగ్రెస్ హైకమాండా? అని ఖచ్చితంగా సీమాంద్ర ఎంపీలే అని పుట్టు మూగవాడైన చెబుతాడు. ఎందుకంటే..కళ్ల ముందు కనిపిస్తున్న పెప్పెర్ ప్రయోగమే ఇందుకు కారణం.
అసలు సీమాంద్ర ఎంపీలు అలా ప్రవర్తించటానికి కారణం ఎవరు? అరవై సంవత్సరాల నుండి కలిసి ఉన్న జాతిని విడగొట్టే ప్రయోగం చేసింది ఎవరు? ఆంద్రప్రదేశ్ కంటే..పెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నిఎందుకు విడదీయ్యలేదు. ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు అనేక సార్లు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని మొరపెట్టుకున్నా..కాంగ్రెస్ పార్టీ కనికరించలేదు.
అక్కడ చెయ్యని ప్రయోగం ఆంద్రప్రదేశ్ లో ఎందుకు చేశారు? కాంగ్రెస్ పార్టీ ఏం ఆశించించి తెలంగాణ పేరును తెరపైకి తెచ్చింది? తెలంగాణ ప్రజల్లో విషబీజాలు నాటింది కాంగ్రెస్ పార్టీ కాదా?
అన్నదమ్ములుగా కలిసి ఉన్న తెలుగు జాతిని రెండు చీల్చి పాలించాలని చూసింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ ప్రాంత ప్రజల్లో 100 శాతం ఆశలు పుట్టించింది ఎవరు? సరే మీకు తెలంగాణ ఇవ్వాలని ఉంది? తెలంగాణ ప్రాంత ప్రజలు,నాయకులు అడిగారు.
అలాగే కలిసి ఉన్న వారిని నుంచి వీడదీసే ముందు.. వెళ్లిపోయేవారికి. .ఏమీ కావాలి? మీ డిమాండ్స్ ఏమిటి? మీకు ఏమీ కావాలి? ఇక్కడ ఉన్నవారికి ఇవి ఇస్తున్నాం. వెళ్లిపోయేవారికి ఇవి ఇస్తున్నాం? అని ఏ రోజైన కాంగ్రెస్ పార్టీ చెప్పటం జరిగిందా?
‘‘ చిదంబరం వచ్చి తెలంగాణ ఇస్తున్నాం, షిండే వచ్చి తెలంగాణ రాష్ట్రా ఏర్పాటు అయ్యింది; డీగ్గీ రాజా సీమాంద్ర ప్రాంతం వారు వెళ్లిపోవాలి. హైదరాబాద్ తెలంగాణ కే చెందుతుందని..మీడియా ప్రకటనలు చేసి, రాష్ట్రాన్ని సర్వనాశం చేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? ’’
‘‘ తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది విద్యార్థులు బలిదానం అయితే ’’ కనిపించని ప్రజాస్వామ్యం .. ఇప్పుడు కనిపిస్తుందా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండని.. సీమాంద్ర ప్రజలు, సీమాంద్ర ఉద్యోగులు 100 రోజులు సమ్మె చేస్తే.. ఖద్దర్ చొక్క ధరించిన ఒక్క నాయకుడైన స్పందించారా?
అప్పుడులేని ప్రజాస్వామ్యం ఇప్పుడు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం కోరుతూ.. తెలంగాణ ప్రజలు , తెలంగాణ నాయకులు ఉద్యమంలో ‘‘ట్యాంక్ బండా పై నిలబడి ఉన్న మన మహానీయుల విగ్రహాలు పగిలిపోయినప్పుడు ’’ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
ఒక పోలికట్ లీటర్ తండ్రి ఆకాశంలో చనిపోతే.. భూమి మీద బతికున్న ఆయన అభిమానులు ఆత్మహత్యలు చేసుకున్నారు. తన తండ్రి అభిమానులు కోసం.. ఓదార్పు యాత్ర చేసిన నాయకుడు ఉన్నారు. అలాగే ..తెలంగాణ కావాలని.. 1000 మంది, సమైక్యంగా ఉండాలని కొంత మంది విద్యార్థులు బలిదానం అయితే ఏ రాజకీయ పార్టీ కూడా.. వారి కోసం ఓదార్పు యాత్ర చెయ్యలేదు.
అప్పడేమైంది .. ఈ ప్రజాస్వామ్యం. మన ప్రజా స్వామ్యంలో నిజాయితీ లేని నాయకులు అరనిమిషానికో.. అవినీతికి పాల్పాడుతున్నవారిని ఈ ప్రజాస్వామ్యం ఏం చేసింది? ప్రజా నాయకులే పాపాలు చేసి, సొమ్ము సంపాదించుకోని స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ ములుగుతున్న, ఆబ్లాక్ మనీని.. ప్రజ్యాస్వామ్యంలోకి తెలేకపోయిన మన దేశ పెద్దలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
మన దేశ నాయకులే.. స్విస్ బ్యాంకులో ఎక్కువ మంది ఉన్నారని తెలిసినప్పుడు.. మన దేశం పరువు పోలేదా? మన దేశంలో జరిగినన్ని కుంభకోణాలు ఏదేశం జరగలేదు, అదీకూడా కాంగ్రెస్ పార్టీలోనే..ఎక్కువు కుంభకోణాలు జరిగినట్లు చరిత్ర లో చాలా ఉన్నాయి.
ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే.. ప్రజాస్వామ్యం విలువను మంటగలిపారు. అది ఒక ప్రాంతం అని లేదు? ఒక జాతి అని లేదు. తెలుగు జాతి వల్ల ..ప్రజాస్వామ్యం విలువ పడిపోయిందంటే అది చాలా పెద్ద తప్పు. ? తెలుగు జాతి అలా ప్రవర్తించటానికి కారణం కాంగ్రెస్ హైకమాండే.
ఒకవేళ ప్రాంతాలు వారిగా తెలుగు ప్రజలు విడిపోయిన, తెలుగు జాతిగానే కలిసే ఉంటారు. తప్ప.. తెలంగాణ జాతని , సీమాంద్ర జాతని వేరుగా ఉండదు. అయితే.. ఇక్కడ రెండు ప్రాంతాల నాయకుల్లో ఆలోచన భావాలు తగ్గిపోయి, ఆవేశ భావాలు పెరిగిపోవటమే.
పార్లమెంట్ లో పెప్పెర్ ప్రయోగం జరిగింద తప్ప.. ? తెలుగుజాతి పరువును తీద్దామని, ప్రజాస్వామ్యం విలువను నాశనం చేద్దామని, ప్రపంచ దేశాలచేత.. ప్రజాస్వామ్యం గురించి చెప్పించుకునే స్థాయికి, మన దేశం గానీ, ఏ ప్రాంత నాయకులు గానీ,ఏ జాతి ప్రజలు గానీ సిద్దంగా లేరు.
భారతదేశంలో పుట్టిన ప్రతిఒక్కరికి పుట్టుకతోనే..ప్రజాస్వామ్యం పై అభిమానం , గౌరవం తోనే, బాధ్యత పెంచుకుంటూ..పెరుగుతారు.. మనదేశ ప్రజలు. అయితే పార్లమెంట్ సాక్షిగా తన్నుకుంది తెలుగుబిడ్డలే, ఆవేశంలో.. అరుపుల మద్య, పెప్పర్ ప్రయోగం జరిగిందే తప్ప, కావాలని చేసిందని కాదని తెలుస్తోంది.
రాష్ట్రం కావాలని అడిగింది పొన్నం ప్రభాకర్ అయిన, కలిసుండాలని పెప్పర్ ప్రయోగం చేసిన లగడపాటి అయిన తెలుగు జాతి పిల్లలే.
‘‘తెలంగాణ కోసం, సమైక్యం కోసం వెళ్లిన విద్యార్థులను, లాయర్ల ను అరెస్టు చేస్తున్న సమయంలో.. తెలంగాణ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న అనంతపురం జిల్లా తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యవులు కేశావులను ఢిల్లీ పోలీసులు..అతి దారుణంగా.. చొక్క పట్టుకోని లాక్కుపోతుంటే.. కాపాడింది ఎవరు? తెలుగు జాతి పిల్లలైన తెలంగాణ లాయర్లు? ’’
తెలుగు జాతి పిల్లలు ఆవేశంలో అరుచుకున్న.. ఆపదలో అందరు ఒకటే అవుతారనే విషయాన్ని లాయర్లు నిరుపించారు. అలాగే.. పొన్నం మీద..లగడపాటి పెప్పెర్ ప్రయోగం చేసిన, ఆ ఇద్దరి మద్య మైత్రి సంబంధం కొనసాగుతునే ఉంటుంది.
కాకపోతే..కాంగ్రెస్ పార్టీనే పూర్తిగా నష్టపోయేది. ఇప్పుడు తెలంగాణ కోసం అడ్డుపడుతున్నారు, ఇప్పుడు తెలంగాణ కోరుకున్న వారు.. పది సంవత్సరాల తరువాత ఎలా ఉంటారు. విడిపోయి.. కలిసి మేలిసి వ్యాపారాలు చేసుకుంటూ, పెళ్లి సంబంధాలు పెట్టుకుంటూ కనిపిస్తారు.
కాబట్టి ఆవేశాలు అర నిమిషం పాటు ఉంటే, ఆలోచన..అరవై సంవత్సరాల పాటు ఉంటుంది. కాంగ్రెస్ హైకమాండ్ పెట్టిన చిచ్చుతో.. తెలుగు ప్రజలు విడిపోయారు గానీ, లేకపోతే తెలుగు ప్రజలు పార్లమెంటులో పెప్పెర్ ప్రయోగం చేయటం చాలా దారుణమైన విషయమే.
కాంగ్రెస్ పార్టీ ఆడుతున్ననాటకంలో.. తెలుగు ప్రజలు బలైనారు తప్ప.. ఇందులో తెలుగు జాతి తప్పులేదని అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతో ఆంద్రప్రదేశ్ లో.. ఆరని మంటలు..తెలుగు ప్రజలు మద్య రేగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ వల్ల దేశం సర్వనాశనం అయిన ఆశ్చర్యంలేదని రాజకీయ మేథావులు అంటున్నారు. గత పది సంతవత్సరాల నుంచి మన దేశ ప్రధాని మౌనం పాటించటం వలనే.. దేశం లో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుందనే రాజకీయ మేథావులు అంటున్నారు.
మన ప్రజాస్వామ్యంలో.. గెలిచిందేవరు. ఓడిందెవరు అంటే.. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు వల్ల.. అందరు ఓడిపోతూనే.. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాం.
‘‘అసలు ఇటలీ గాంధీకి.. భారతదేశ ప్రజాస్వామ్యం గురించి ఎలా తెలుస్తోంది’’ భారత గడ్డ మీద పుట్టిన వారికైతే ,దేశంలోని ప్రజలకు ఏదీ కావాలో, ఏదీ మంచో, ఏదీ చేడో, అనేది తెలుస్తోంది. ఎంత క్లిష్టమైన సమస్యలను సైతం సునాయాశంగా పరిష్కారించుకుంటారు. అలాంటి మేథాసంపన్నులు పుట్టిన దేశం మనది.
ఇటలీ గాంధీ కల ఒక్కటే.. దేశంలోని ప్రజలు ఏమైన, దేశంలోని రాష్ట్రాలు ఎలా విడిపోయిన.. తన కొడుకు ప్రధాని మంత్రి కావాలనే ఉద్దేశమే.. ఇలాంటి పరిణమాలకు దారి తీస్తుంది. రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి కావటానికే.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో.. విభజన మంటలు పెట్టిన విషయం దేశంళోని ప్రతి ఒక్కరికి తెలుసు.
ఇప్పటి వరకు ప్రజల కోసం పోరాటం చేసిన నాయకులను చూసి ఉంటాం. కానీ పదవి కోసం ప్రజల పై పోరాటం చేస్తున్న ఇటలీ గాంధీని మనం చూస్తున్నాం.
‘‘వరప్రసాదం పొందినవాడు.. దేవత అంటారు. వరప్రసాదం పొందని వాడు దెయ్యం అంటారు’’. ఏమైన ఇలాంటి పెప్పర్ ఘటన మరల జరగకుండా చూసే బాధత్య మనప్రభుత్వం మీద, మన నాయకులు మీద, మన ప్రజల మీద ఉందనే విషయం అందరు తెలుసుకోవాలి.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more