తెలంగాణాతోనే తిరగొస్తానంటూ హైద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళిన కెసిఆర్ కి అనుకూల పవనాలే వీస్తున్నా, కొన్ని విషయాలలో ఎటువైపు నిర్ణయం తీసుకోవాలా అని మీమాంసలో పడ్డట్టుగా కనిపిస్తున్నారాయన. ఆయన్ను మీమాంసలో పడేసిన విషయాలు ఇవి-
1. కేంద్ర మంత్రి జైరాం రమేష్ స్వయంగా కెసిఆర్ నివాసానికి వెళ్ళి 18,19 తేదీల్లో తెలంగాణా బిల్లుకి ఆమోదం లభిస్తుందని, సవరణలంటూ పట్టుబట్టకుండా ప్రశాంతంగా బిల్లుని ఆమోదముద్ర వేసుకునేందుకు సహకరించాలని అన్నారు. సీమాంధ్ర నుంచి వస్తున్న వ్యతిరేకతలు, పార్లమెంటులో చోటుచేసుకున్న ఆందోళనల దృష్ట్యా సోమవారం ముందు బడ్జెట్ వోట్ ఆన్ ఎకౌంట్ అయిపోతే 18, 19 తేదీల్లో తెలంగాణా బిల్లు సభ ముందుకు వచ్చిన సందర్భంలో తెలంగాణా ఎంపీలు సహకరిస్తేనే బిల్లు పాసవుతుందని వివరించారు.
బిల్లు మీద కెసిఆర్ కి కొన్ని అభ్యంతరాలను ముఖ్యంగా ఉద్యోగులు, పెన్షన్ ల విషయంలో స్థానిక ప్రాతిపదికనే నిర్ణయె జరగాలని వెలిబుచ్చినా, అది కుదరదని జైరాం రమేష్ వివరించినట్లు, మిగిలిన సవరణల విషయంలోనూ కెసిఆర్ అంగీకరించినట్లు తెలిసింది. కానీ దీన్ని ఒప్పుకున్న మచ్చ తెలంగాణా చరిత్రలో ఎల్లకాలం ఉండిపోతుందనే భయం కూడా ఉంది.
2. పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ఢిల్లీలో సమావేశమైన కెసిఆర్ కాంగ్రెస్ పార్టీతో విలీనం గురించి కూడా చర్చించారు. విలీనానికి కాంగ్రెస్ పార్టీ నుంచి వత్తిడైతే వస్తోంది కానీ విభజన బిల్లు పార్లమెంటులో ముందు పాసవాలని కెసిఆర్ చూస్తున్నారు.
3. ఒకవేళ విలీనం చెయ్యకుండా ఎన్నికలలో పోటీ చేసినట్లయితే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది కూడా కెసిఆర్ తెరాస నాయకులతో చర్చిస్తున్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో గట్టిగా పట్టుబట్టి ఇంతవరకు తీసుకునివచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ప్రాంతంలో మంచి పేరే వచ్చింది. అందువలన కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే అనవసరమైన పోటీ అవుతుందేమో ఓట్లు ఎలా చీలిపోతాయో అన్నది కూడా ఒక సమస్యే. ఎందుకంటే భాజపా మద్దతు లేకుండా బిల్లు ఆమోదం పొందదు కాబట్టి భాజపా కూడా తెలంగాణా లో పోటీ చెయ్యవచ్చు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీకి వచ్చిన క్రేజ్ కూడా తోడవచ్చు.
అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, తెదేపాలను పక్కకు పెట్టినా, భాజపా కాంగ్రెస్ తెరాస ల మధ్య త్రిముఖ పోటీ ఉండవచ్చు. అప్పుడు ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారన్నిది చెప్పటం కష్టమౌతుంది, ఇంతకాలం శ్రమించి చేసిన ఉద్యమానికి ఫలితం రాబోతున్న సమయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు అన్నిది మరో సమస్య. ఇలా, ఎటువైపు నిర్ణయం తీసుకోవాలా అన్న దానిలో కెసిఆర్ తెరాస నాయకులతో కలిసి తర్జనభర్జనలు పడుతున్నారు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more