తెలుగు జాతి ‘అన్నా ’ అని పిలుచుకొనే నందమూరి తారక రామారావు స్థాపించిన ‘తెలుగు దేశం ’ పార్టీని ఆయన కుమారుడు నందమూరి హరిక్రిష్ణ వీడబోతున్నారా ? బావ చంద్రబాబు ఆధిపత్య పోరుతో కలత చెందిన ఆయన బీజేపీ పార్టీలోకి చేరబోతున్నాడా ? ఆయనే కాకుండా ఎన్టీఆర్ కుమార్తె, కేంద్రమంత్రి పురేందరీశ్వరీ కూడా కమలం పార్టీలోకి వెళ్ళపోతున్నారా ? అంటే సినీ రాజకీయ రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం అవుననే సమాధానం వినిపిస్తుంది.
తెదేపాలో హరిక్రిష్ణకు చంద్రబాబుకు గత కొంత కాలంగా వైరం కొనసాగుతుంది. ఆ కారణంగానే ఇటీవల జరిగిన ప్రజా గర్జనకు ఆహ్వానించకపోవడం , పార్టీలో సరైన ప్రాధాన్యత కల్పించక పోవడంతో హరిక్రిష్ణ బీజేపీలో చేరడానికి సిద్దం అవుతున్నారని అంటున్నారు. ఇక కేంద్రమంత్రి పురందరీశ్వరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆ పార్టీని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. సీమాంధ్రలో బలంగా ఉన్న పలువురు నేతలు, కేంద్రమంత్రులు తమ పార్టీలోకి వస్తారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, స్థానిక బిజెపి నాయకులు కూడా చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.
ఈమెతో పాటు దగ్గబాటి వెంకటేశ్వర రావు కూడా బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారట. 2014 ఎన్నికల్లో విశాఖ లోకసభ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు స్థానిక బిజెపి తీవ్రంగా కృషి చేస్తోంది. నగరాల్లో ఉన్న మోడీ హవా కూడా అక్కడ వీస్తోంది. దీనికి తోడు తాను విశాఖను వదిలేది లేదని పురంధేశ్వరి ఇటీవల చెప్పారు. అక్కడ ఆమెకు టి సుబ్బిరామి రెడ్డి నుండి కాంగ్రెసు టిక్కెట్ కోసం తీవ్ర పోటీ ఉంది. దీంతో కేంద్రమంత్రుల్లో పురంధేశ్వరి బిజెపి వైపు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే తన తాత స్థాపించిన పార్టీనీ వీడేది లేదని చెప్పుకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి బాటలో నడిచి కమలంలోకి వస్తాడా ? లేక తెలుగు దేశం లోనే ఉంటాడా ? అన్నది చూడాలంటున్నారు .
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more