ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్రం మీద ఎంత మెతక వైఖరి అవలంబిస్తున్నారో అందరికి తెలుసు. కేంద్రం నుండి ఏపి కోసం ప్రత్యేక హోదా మీద ఎలాంటి హామీ రాకున్నా కానీ కేంద్రాన్ని పల్లెత్తి మాట అనలేదు. అయితే తాజాగా పరిస్థితిలో మార్ప వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు నాయుడు స్వరంలో కాస్త బేస్ పెరిగినట్లు కనిపిస్తోంది. నిన్నటి దాకా కేంద్రం అన్నీ చూసుకుంటుంది అని అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేంద్రం తప్పక చూడాల్సిందే అని అంటున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఏపీని కేంద్రం ఒడ్డున పడేయాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు ఈ మేరకు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏపీ ఆర్థిక అవసరాల కోసం కేంద్రం రూ.700 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి విడుదలైన నిధులు రాష్ట్ర ఖజానాకు చేరిన మరునాడే ఈ విషయంపై చంద్రబాబు స్వరం పెంచడం గమనార్హం.
వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్న ఏపీని కేంద్రం ఆదుకోవాల్సిందేనని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. వరద సాయాన్ని కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని ఆయన అభ్యర్థించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక చిక్కుల్లో పడ్డ ఏపీకి విభజన చట్టం హామీల మేరకు కేంద్రం నిధులు విడుదల చేస్తుందని తాను ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more