ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి రానీయకుండా ఎలా కుట్ర పన్నారో.. అదే కుట్రను ప్రస్తతం ఇక్కడ తెలంగాణలో కూడా పునరావృతం చేస్తున్నారని.. అయితే ఇక్కడ ఎన్నికలకు ముందే ప్రజా కూటమిగా ఏర్పడ్డారని ఆయన ద్వజమెత్తారు.
తెలంగాణలో ప్రజాకూలమి పేరుతో జరుగుతున్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీలన్నీ అవినీతిలో కూరుకుపోయాయని, ఎన్నికలయ్యాక అన్నీ ఒక్కటేనని చెప్పారు. ప్రజలను మోసం చేసేందుకు రాహుల్, చంద్రబాబు సభలు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో తల్లీకొడుకుల రాజ్యం, టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, కేసీఆర్ మధ్య విబేధాలొచ్చినట్టు డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.
ఇక ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ కు తన పార్టీ సపోర్టును కేసీఆర్ అందిస్తారని ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. అందుకనే యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ కేసీఆర్ ను ఒక్కమాట కూడా అనకుండా ప్రసంగాన్ని కొనసాగించిందని జీవీఎల్ విమర్శించారు. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని జీవీఎల్ అరోపించారు. అందుకనే కేసీఆర్ కూడా సోనియాగాంధీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు కేసీఆర్-ఓవైసీ బాయ్ బాయ్ గా మారరని, అయితే ఎన్నికలు అయిన తరువాత కేటీఆర్- రాహుల్ గాంధీ విమర్శించారు భాయ్ భాయీగా మారుతారని వీరందరూ ఒకే గూటి పక్షులని ఆయన జోస్యం చెప్పారు. ఈ నిజాన్ని విజ్ఞులైన తెలంగాణ ఓటర్లు గ్రహించాలని జీవీఎల్ కోరారు. టీఆర్ఎస్ పార్టీ గతంలో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందని.. వారితో కేసీఆర్, కేటీఆర్ లకు మంచి మైత్రి వుందని కూడా జీవీఎల్ పేర్కోన్నారు. అందరూ కలసి లాలూచీ రాజకీయాలను చేస్తున్నారని ఆయన విమర్శించారు. సరైన ప్రత్యామ్నాయ పార్టీని ఎన్నుకోవాలని ఓటర్లును జీవీఎల్ అభ్యర్థించారు.
(And get your daily news straight to your inbox)
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more
Dec 20 | అనంతపురం అభివృద్ధికి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అర్ధరూపాయి కూడా ఖర్చు చేయలేదని మేయర్ స్వరూప విమర్శించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జేసీపై మండిపడ్డారు. అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడు జేసీ అని,... Read more