బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో మండిపడ్డ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు.. ఆయనపై విరుచుకుపడ్డారు. తాను మేధావినంటూ డప్పు వాయించుకుంటున్న స్వామికి ఏదో ఒక రోజు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరించారు.
సుబ్రమణ్యస్వామి ఒక బ్లాక్ మెయిలర్, శాడిస్ట్ అంటూ హనుమంతరావు తిట్టిపారేశారు. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దిక్కుతోచని బీజేపీ నేతలు.. ఇప్పుడు రాహుల్ ని టార్గెట్ చేస్తూ ఆయనపై వ్యాఖ్యలు చేస్తున్నారని వీహెచ్ అన్నారు. రాహుల్ కు బ్రిటీష్ పౌరసత్వం వుందని, కమీషన్ ఏజెంట్ అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తమ పార్టీపై ప్రతిపక్షాలు దాడిచేస్తాయని ముందుగానే భావించిన స్వామి.. వారి దృష్టిని మళ్ళించడం కోసమే రాహుల్ పై విమర్శలు చేస్తూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని వీహెచ్ ఆరోపించారు. అలాగే.. మోదీ, ఆర్ఎస్ఎస్ ల నుంచి ప్రశంసలు అందుకోవడం కోసమే లేనిపోని అభాండాలను రాహుల్ పై మోపుతున్నారని పేర్కొన్నారు.
మరోవైపు.. తనమీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో స్పందించిన రాహుల్.. తనపై విచారణ చేసుకోవాలని ప్రధాని మోదీకి సవాల్ చేసిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఆ విషయాన్ని వీహెచ్ తెరపై తీసుకొస్తూ.. రాహుల్ చేసిన సవాల్ ని మోదీ స్వీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more
Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more
Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more
Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more
Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more