నిర్వాణ షట్కం
ఇందులో అత్యున్నతమైన అద్వైత సిద్ధాంతం బహు సుందరంగా చెప్పారు ఆది శంకర భగవత్పాదులు. ఒక శ్లోకానికి అర్థం తెలుసుకుంటే మిగతావి చాలా సులభంగా అర్థమవుతాయి.
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్వ జిహ్వే నచ ఘ్రాణ నేత్రే,
నచ వ్యోమ భూమిర్నతేజో న వాయు, చిదానంద రూపం శివోహం, శివోహం
ఇది మొదటి శ్లోకం. ఇందులో, 'నేను' అంటే ఏమి కాదో చెప్పారాయన. మిగిలిన 5 శ్లోకాల్లోనూ అంతే. 'ఇది కాదు ఇది కాదు' అని శోధించే విధానంలో, నేతి నేతి (న ఇతి న ఇతి) అంటూ చెప్పుకోవటం ఒక పద్ధతి. అలా ఎందుకు అంటే, నేను అనే దానికి మనం సామాన్యంగా ఆపాదించిన అర్థం మేను (శరీరం), అందులోని భాగాలు, లేక మన భావాలు, ఆలోచనలు, మన గుణాలు, మన సంబంధాలు లేక మనోవికారాలు అని అనుకుంటున్నాం. అవేమీ కాదని శంకరుల వారు అంటున్నారు. ఇందులో సున్నితంగా నేను అని తనగురించి చెప్పుకుంటూనే తనలో కలిగిన ఙానోదయాన్ని అందరికీ పంచుతున్నారాయన.
కళ్ళు ముక్కు చెవులు నోరు చర్మాలనే పంచ ఙానేంద్రియాలతో చూడటం, వాసన పసిగట్టటం, వినటం, రుచి చూడటం, స్పర్శ గ్రహించటం చేస్తూ మన శరీరం బయట జరిగే విషయావగాహనను (డేటాను) మనసుకి పంపిస్తున్నాం. వాటిని సమీకరించే అంతఃకరణాలను కూడా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటూ విభజించారు మన ఋషులు. పంచేంద్రియాల ద్వారా గ్రహించే విషయాలను సమీకరించి, భద్రపరచి, అవసరమైనప్పుడు తగు నిర్ణయం తీసుకుంటూ కర్మాచరణకు కర్మేంద్రియాలను ప్రేరేపిస్తూ ఉండేవాటిని గుర్తించి, మనసు బుద్ధి, చిత్తం, అహంకారం అంటూ వర్గీకరణ చేసారు. అలాగే మన శరీరం ఇతర పదార్థాలలాగానే పాంచభౌతికమైనది. అంటే, మన శరీరం భూమి, వాయువు, అగ్ని, జలము, ఆకాశ తత్త్వాలతో తయారైంది అని చెప్తారు. ఈ ఈ పంచ ఙానేంద్రియాలు కానీ, నాలుగు అంతఃకరణాలు కానీ పంచ భూతాలు కానీ నేను కాదు అని అంటున్నారు శంకరులు ఈ శ్లోకంలో.
సామాన్య మానవుడు తన శరీరమే తాను అని అనుకుంటాడు. ఇంకా లోతుగా ఆలోచించే వాళ్లు ఇలా పంచఙానేంద్రియాలు, పంచభూతాలు, అంతఃకరణాల గురించి ఆలోచిస్తారు. అలా సామాన్య ప్రజలు, మేధావులు కూడా ఎరిగిన ఇవేమీ నేను కాదు అని శంకరాచార్యుల వారు తాను తెలుసుకున్నట్టుగా చెప్తున్నారు.
అయితే మరి ఇంతకీ ఆ నేను ఎవరు?
అన్ని శ్లోకాలలోనూ చివర్లో చిదానంద రూపం, శివోహం, శివోహం అని చెప్పారు. అంటే నేను అనేది ఆనంద స్వరూపమైన శివం. అందుకే, నేనే ఆ శివాన్ని అని వివరిస్తున్నారు.
అద్వైత సిద్ధాంతంలో ఏకత్వాన్ని ప్రతిపాదించే ఈ శ్లోకాలను నిర్వాణ షట్కం అని అన్నారు. ఎందుకంటే నిర్వాణం అంటేనే అత్యున్నతమైన, మహోతృష్టమైన, గొప్పదైన ఙానం అంటే బ్రహ్మఙానం పొందటం.
శివం అన్నా, నారాయణుడు అన్నా బ్రహ్మం అన్నా అంతా ఒకటే- శుద్ధ చైతన్యం. ఆ చైతన్యమే సర్వ ప్రాణులలోనూ అంతర్వాహినిగా ఉంటూ అన్ని కర్మలకూ సాక్షీభూతంగా ఉంటుంది. ఆ బ్రహ్మమే నేను కానీ ఈ శరీరం, అందులోని స్థూల సూక్ష్మ భాగాలు కాదు అని ఈ మొదటి శ్లోకంలో అన్నారు శంకరాచార్యులవారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Oct 29 | బాధ పెట్టినా, పెట్టకపోయినా నిజాన్ని ధైర్యంతో గంట కొట్టినట్లు చెప్పండి. బలహీనతను గురించి ఎప్పుడూ ఆలోచించకండి. బుద్ధిమంతులు నిజాన్ని భరించలేక పోతే లేదా దానిలోవడి కొట్టుకుపోతారనుకుంటే కూడా దిగులు పడకండి. అలాంటి వ్యక్తులు ఎంత... Read more
May 03 | ప్రార్ధన అంటే ఉదయం లేచినప్పుడు తాళం చెవి, రాత్రి పడుకునేముందు తలుపు గడియ- మహాత్మా గాంధీప్రార్ధన చేస్తూ ఉదయాన్ని ప్రారంభించండి, పడుకునే ముందు ప్రార్ధన చెయ్యండి అని చెప్పటాన్ని ఆ విధంగా సుందరమైన ఉపమానంతో... Read more
May 02 | శిశువు జన్మించినప్పుడల్లా దేవుడింకా మానవజాతిమీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదనే సంకేతం వస్తుంది - రవీంద్రనాథ్ టాగూర్ ఎంత చక్కని ఆలోచన ప్రకృతిలో మానవజాతి అంతరించకుండా చూస్తున్నాడంటే దేవుడికింకా మానవుల మీద నమ్మకం పోలేదన్నమాట. తన... Read more
May 01 | ముక్తిమార్గంలో అత్యుత్తమమైనది భక్తి మార్గం. అందులో లక్ష్యం ఎవరిని వారు తెలుసుకోవటం - ఆది శంకరాచార్య.భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మయోగం, హఠయోగం, సన్యాసం, మంత్ర యోగం ఇలా ఎన్నో మార్గాలను మనకు పెద్దలు... Read more
Apr 30 | భూమి ఒక్క గొప్ప వ్యాయామశాలఇక్కడికొచ్చి మనం శక్తివంతులుగా తయారవుతాం - స్వామి వివేకానందమానవ జీవితాన్ని ఎందరో ఎన్నో రకాలుగా వర్ణించారు. కొందరు దీన్ని రంగస్థలం, దీని మీద మనం ఆడేది నాటకం అని అన్నారు. ... Read more