దేశంలోని 28 రాష్ట్రాలకున్న అధికారాలు, కేంద్రంతో ఆ రాష్ట్రాలకున్న సంబంధాలు 29వ రాష్ట్రంగా ఏర్పడబోయే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉండాల్సిందేనని ఖచ్చితంగా చెప్పామన్నారు. దేశంలోని రాష్ట్రాలన్నింటికీ ఒక కానూన్, తెలంగాణ రాష్ట్రానికి ఒక కానూనా? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్రావు నిలదీశారు. హైదరాబాద్కు సంబంధించిన అధికారాలన్నింటినీ గవర్నర్కు అప్పగించడమంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను అవమానించడమేనని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ఉండాలి తప్ప, ఎటువంటి ఆంక్షలకు ఒప్పుకునేదిలేదన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు ముసాయిదాపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని వాటిపై మూడు, నాలుగు రోజుల్లో ప్రధాని మన్మోహన్సింగ్కు లేఖ రాస్తామని, అవసరమైతే ఒక ప్రతినిధి బృందం వెళ్ళి ఆయనను కలుస్తుందని కేసిఆర్ వెల్లడించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ వచ్చే వరకు తాము విశ్రమించబోమని, ఉద్యమ నాయకత్వం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక ఘట్టం మాత్రమే ముగిసిందని, అంతిమంగా పూర్తి స్థాయి డ్రాఫ్ట్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందినప్పుడే చివరి ఘట్టం ముగుస్తుందని అప్పుడు ప్రపంచంలోనే ఎవరూ నిర్వహించని రీతిలో సంబరాలు జరుపుకుంటామని, సంబరాలకు ఇది సమయం కాదని కేసీఆర్ చెప్పారు.
ఉద్యోగులు, పెన్షనర్ల పంపిణీ జనాబా దామాషా ప్రకారం పంచుతామనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ఇది సమ్మతంకాదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పా టు వేరు, తెలంగాణ ఏర్పాటు వేరన్నారు. సమైక్య రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో పెద్దమనుషుల ఒప్పందం జరిగిందని, అనంతరం కూడా ఉద్యోగ నియామకాలపై తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎన్ని జీవోలు వచ్చినా వాటన్నింటినీ తుంగలోతొక్కడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 24 వేల మంది సీమాంధ్రులు అక్రమంగా తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తించి వారిని తిరిగి వారి ప్రాంతాలకు పంపాలని కాసు హయాంలో జివో నెం.36ను తీసుకువచ్చిన విషయాన్ని కేసిఆర్ గుర్తు చేశారు. 1985లో ఎన్టిఆర్ హయాంలో 59 వేల మంది తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తించారని దీంతో దాదాపు 83 వేల మంది ఇక్కడే పదవీ విరమణ చేశారని, వారందరి పెన్షన్లను తెలంగాణ రాష్ట్రం ఎందుకు భరిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రం వారికి అక్కడే పెన్షన్లు ఇవ్వాల్సిందేనని, లేదంటే పోరాటం చేస్తామన్నారు.
జనాభా దామాషా ప్రకారం అప్పులు, ఆస్తులు పంపకాలు చేయాలనే ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల వారీగా అప్పులు పంచాలి తప్ప ఇతర ప్రతిపాదన వద్దన్నారు. ఆస్తుల విషయంలో కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న హైదరాబాద్ భవన్ను కోల్పోయామని, నిజాం హయాంలో ఢిల్లీలో కట్టిన ఎపి భవన్ను ఇప్పుడు వదులుకునేందుకు సిద్దంగా లేమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెంటనే హైకోర్టును మంజూరు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు లింకు పెట్టొద్దని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నిబంధనలు ఐదేళ్ళని కొందరు, పదేళ్ళని కొందరు అంటున్నారని, కామన్ ఎంట్రెన్స్ అంటున్నారని రెండు రాష్ట్రాలకు ఒకే ఎంట్రెన్స్ ఎక్కడైనా ఉందంటూ ప్రశ్నించారు. అనవసర ఘర్షణలు చెలరేగే అవకాశమున్నందున వెంటనే ఆ రాష్ట్రంలో కూడా విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 18 రాజ్యసభ సీట్లుండగా, తెలంగాణకు కేవలం 7 మాత్రమే కేటాయించడం అశాస్త్రీయమన్నారు. 2014లో రిటైర్డ్ అవుతున్న సభ్యుల్లో ఇద్దరు తెలంగాణ వారున్నారని, కానీ, ఎన్నికల్లో కేవలం ఒకటే సీటు కేటాయిస్తామనడం సరికాదన్నారు. 2014లో 2, 2016లో 2, 2018లో 3 సీట్లు తెలంగాణకు కేటాయించాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more