యావత్ దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర విజభనకే కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిసింది. నేటి సాయంత్రం మన్మోహన్ సింగ్ అధ్యక్షన జరిగిన కేబినెట్ సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన అంశం పై సుదీర్ఘంగా చర్చించి, గత కొన్ని రోజులుగా వస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదన కాకుండా, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
అన్ని విషయాలనూ కూలంకషంగా చర్చించిన అనంతరం రెండు ప్రాంతాలలోనూ ప్రజలు నష్టపోకుండా, తెలంగాణా ప్రజాభీష్టానికి అనుగుణంగా పది జిల్లాల తెలంగాణాను ప్రకటించాలని కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ సమావేశం అనంతరం హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ...
గతంలో సీడబ్ల్యూసీ నిర్ణయించినట్టుగానే ఈ నిర్ణయం జరిగినట్టు తెలిపారు. విభజన అంశానికి సంబంధించి జీవోఎం సిఫార్సు మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తూ... ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉంటుందని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఉమ్మడి రాజధాని ఉంటుందని తెలిపింది.
ప్రజల భద్రతకు తెలంగాణ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలుంటాయి. ఆర్టికల్ 3 కింద బిల్లు ఆమోదం పొందుతుంది.
పోలవరం ప్రాజెక్ట్ జాతీయ హోదా కల్పిస్తూ... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యతను కేంద్రం స్వీకరిస్తుందని, ఆర్టికల్ 371 డి రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందని, రెండు రాష్రాల అభివృధ్దికి కేంద్ర సహాయం అందిస్తుందని షిండే మీడియా సమావేశంలో అన్నారు.
సీమాంద్రకు కొత్త రాజధానిని 45 రోజులలో నిపుణుల కమిటీ గుర్తిస్తుందని, 371 (డి)ని రెండు రాష్ట్రాలలోనూ అమలు చేస్తారని ఆయన వెల్లడించారు. తెలంగాణా అవతరణకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రేపో, ఎల్లుండో పంపిస్తామని ఆయన వివరించారు. పదేళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని ఆయన వివరించారు.
ఈ శీతాకాల సమావేశాలలోనే తెలంగాణా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ బిల్లును ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి పంపిస్తామని, నిర్దిష్ట సమయంలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ బిల్లుపై తమ అభిప్రాయం వెల్లడించవలసి ఉంటుందని ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more