కష్టనష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలు, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరేందుకు అపాయింట్మెంట్ అడిగినా, నిరాకరించిన ప్రధాని మన్మోహన్ సింగ్ వైఖరి పై తెలుగేదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగువారంటే లేక్కలేకుండా పోయింది. తెలుగు ప్రజాప్రతినిధులంటే విలువే లేకుండాపోయిందని అన్నారు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కాంగ్రెస్కు గతంలో ఎన్టీఆర్ గుణపాఠం చెప్పినట్టు, ప్రజలను ఉద్యమబాటన నడిపించి చరిత్ర పునరావృతం చేసేంతవరకూ తెదేపా విశ్రమించదని ప్రతిజ్ఞ చేశారు. తెలుగు జాతిని అవమానిస్తున్న ప్రధాని మన్మోహన్ను ఇకమీదట తానూ కలిసేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. ఇలాంటి అసమర్థ (మూర్ఖుడు) ప్రదాని ప్రపంచంలోనే ఉండి ఉండడని చంద్రబాబు అన్నారు.
ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి ఎన్నిసార్లు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రధాని ఎగవేయటంపై బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు ప్రధాని కాబట్టి అపాయింట్మెంట్ అడిగామే తప్పించి, మీరు ఆ పదవిలో లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం మాకులేదన్న విషయాన్ని గ్రహించుకోవాలని ఆయన ప్రధానికి సూచించారు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తెలుగువారికి జరుగుతోన్న అన్యాయాన్ని వివరించి, న్యాయం చేయాల్సిందిగా కోరేందుకు నాలుగురోజులుగా నిరీక్షిస్తున్నా పట్టించుకోని ప్రధానిని తానూ ఇకనుంచి లెక్కచేయనని చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయింది. ఈ విషయాలను ప్రభుత్వాధినేతకు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా తెలియచేయటానికి వచ్చిన తనకు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం కంటే తలవంపు మరొకటి ఉండదని విమర్శించారు. నిజాయితీతో వ్యవహరించే తాను ఎలాంటి పైరవీలకూ రాలేదని అంటూ, అవినీతిపరులకు మాత్రం క్షణంలో అపాయింట్మెంట్ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అపాయింట్మెంట్ను నిరాకరించటం ఇది మొదటి సారికాదని బాబు పేర్కొన్నారు. తనపై వ్యతిరేకత ఉన్నందునే ప్రధాని ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాజాగా బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో రైతులకు కనివినీ ఎరుగని నష్టం కలుగుతుందని చంద్రబాబు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more