Mp asaduddin opposes hyderabad as union territory

MP asaduddin opposes hyderabad as union territory, Asaduddin Owaisi meets Sonia Gandhi, Rayala-Telangana , Hyderabad MP Asaduddin Owaisi, Congress president Sonia Gandhi, MIM chief Asaduddin Owaisi, telangana issue, hyderabad as union territory, congress party, seemandhra leadres, trs party, trs leaders,

MP asaduddin opposes hyderabad as union territory

అమ్మకు ఎంఐఎం హెచ్చరిక?

Posted: 11/22/2013 03:54 PM IST
Mp asaduddin opposes hyderabad as union territory

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తో ఈరోజు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. ఎంఐఎం పార్టీ నాయుకుడు సోనియగాంధీతో భేటీ అవటంతో..రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర విభజన పై కేంద్రం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పటం జరిగింది. ఇలాంటి సమయంలో కొంతమంది సీమాంద్ర నాయకులు హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయ్యాలని జీవోఎం సభ్యులకు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం కూడా.. ఇరుప్రాంతాల నాయకులు మద్య రగులుతున్న విభేదాల కారణంగా హైదరాబాద్ ను కేంద్రపాలితం చేస్తే బాగుంటుందనే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 

అయితే దీనిపై సీమాంద్ర కేంద్ర మంత్రులు కూడా..హైదరాబాద్ ను కేంద్రపాలితం చేస్తే బాగుంటుందని మీడియా ముందు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఇలాంటి సందర్బంలోనే.. సోనియా గాంధీ తో అసదుద్దీన్ సమావేశం జరగటంతో.. కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఎంఐఎం పార్టీ మొదటి నుండి తన డిమాండ్స్ ను ఖచ్చితంగా చెబుతుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. లేదా.. రాయల్ తెలంగాణ కావాలని ఎంఐఎం పార్టీ అడుగుతుంది. ఈరోజు సోనియాతో సమావేశమైన అసదుద్దీన్ ఒవైసీ ఒక గంట పాటు హైదరాబాద్ పై మాట్లాడినట్లు సమాచారం. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దని సోనియాని కోరినట్లు తెలిపారు. అయితే అవశేష ఆంధ్రప్రదేశ్ కు హైదరాబాద్ తో భౌగోళిక సంబంధం లేదని ఆయన అన్నారు.

 

అంతేకాకుండా శాంతి భద్రతలు, రెవిన్యూ, భూపరిపాలన రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరినట్లు సమాచారం. హైదరాబాద్ ను కేంద్రపాలితం చేస్తే.. చాలా నష్టం జరుగుతుందని, కేంద్రంలో అతివాద ప్రభుత్వాలు వస్తే ముస్లింలపై దాడులు జరిగే ఛాన్స్ ఉందని సోనియా గాంధీకి హెచ్చరికలు ఇచ్చినట్లు సమాచారం. త్వరలో హైదరాబాద్ విషయన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను కలిసి కేంద్రపాలిత ప్రాంతం చేయవద్దని కోరతామని చెప్పారు. రాయల్ తెలంగాణ ఏర్పాటు చేస్తే మాకు ఎలాంటి అభ్యతరం లేదని కూడా అసదుద్దీన్ చెప్పతున్నాడు.

 

అయితే ఇక్కడ ఒక విషయం అర్థం కావటంలేదు.. సమైక్యం కోరుకుంటున్న వారిలో ఎంఐఎం పార్టీ కూడా ఉంది. అయితే తెలంగాణ నాయకులుమాత్రం ఎంఐఎం పార్టీ మీద ఇప్పటి వరకుఎలాంటి రాజకీయ కామెంట్ కూడా చేయకపోవటం ఆశ్చర్యంగా ఉందని సీమాంద్ర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చివరకు హైదరాబాద్ పై కేంద్రం ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more