సచిన్ చివరి టెస్టు.. అభిమానుల్లో ఒకటే టెన్షన్. ఒక పక్క బాధ, మరో పక్క ఆనందం, రెండు ఒకేసారి కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ప్రపంచ కళ్లు మొత్తం ఇప్పుడు సచిన్ వైపే ఉన్నాయి. సచిన్ ఇక నుండి క్రికెట్ కు దూరమవుతున్నాడు అంటేనే.. అభిమానుల గుండెల్లో ఏదో తెలియాని బాధ కనిపించిస్తుంది. అయితే సచిన్ చివరి టెస్ట్ బెట్టింగ్ రాయుళ్లు కలిసి వచ్చింది. సచిన్ 200వ టెస్ట్. 'అక్షరాలా రెండు వేల కోట్ల రూపాయాలు..' సచిన్ టెండూల్కర్ చివరి టెస్టు సందర్భంగా చేతులు మారనున్న మొత్తం.
చిట్టచివరి టెస్టులో మాస్టర్ ప్రతి కదలికపైనా కాసుల వర్షం కురవనుంది. 'మంచి తరుణం మించినా.. దొరకదు' అన్న చందంగా బెట్టింగ్ రాయుళ్లు వివిధ కేటగిరీల్లో పందేలను ఫిక్స్ చేశారు. సెంచరీ చేస్తాడంటే ఒకరేటు.. డకౌట్ అవుతాడంటే మరో రేటు.. ఎల్బీగా ఔట్ అవుతాడంటే కొంత లాభం.. బౌల్డ్ అవుతాడంటే మరింత లాభం.. అంటూ భారీగా బెట్టింగులకు ఆహ్వానాలు పలుకుతున్నారు. మాస్టర్ చివరి టెస్టు.. అందునా 200వ మ్యాచ్.. ఇకపై సచిన్ మైదానంలో కనిపించడన్న ఆలోచనో.. మరేమో కానీ.. సచిన్ చివరి టెస్టుపై ఆహ్వానిస్తున్న బెట్టింగులకు స్పందన అత్యంత భారీగా ఉంది.
దేశం మొత్తం మీద సుమారు 2 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ సాగనుందని సమాచారం. ఒక్క ముంబైలోనే రూ. 800 కోట్ల మేర బెట్టింగులు కాస్తున్నారంటే.. మాస్టర్ ఫీవర్ ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. మాస్టర్ బ్లాస్టర్ చివరి టెస్ట్ బెట్టింగ్ రాయుళ్లకు వరంగా మారింది. ముంబై లో రేపు విండీస్ తో ప్రారంభం కానున్న చివరి మ్యాచ్ లో సచిన్ మైదానంలోకి అడుగు పెట్టింది మొదలు.. తిరిగి పెవిలియన్ కు వెళ్లేదాకా.. ప్రతి దశలోనూ బెట్టింగ్ నిర్వహించబోతున్నారు.
సచిన్ సెంచరీ చేస్తాడనే నమ్మకంతో ఒక్క రూపాయి బెట్టింగ్ కట్టిన వారికి 7 రూపాయలు చెల్లిస్తామని పాడీ పవర్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ తెలిపింది. సచిన్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని బెట్టింగ్ కడితే ఏకంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తామని విలియమ్ హిల్ ప్రకటించింది. సచిన్ డకౌట్ అవుతాడని బెట్టింగ్ కడితే రూపాయికి 10 రూపాయలు, ఎల్ బిడబ్ల్యూ అవుట్ అవుతాడని పందెం కడితే.. ఐదు రూపాయలు చెల్లిస్తారు.
ఈ విధంగా ఓ వైపు జోరుగా బెట్టింగ్ లు సాగుతుండగా.. వాటిని అరికట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బుకీలపై గట్టి నిఘా ఉంచామని ముంబై పోలీసు కమిషనర్ హిమంశు రాయ్ చెప్పారు. క్రీడా జీవితంలో చివరి మ్యాచ్ ఆడుతున్న సచిన్.. ఇందులో ఎలాంటి ఆటతీరు కనబరుస్తాడోనని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
అయితే.. ప్రస్తుతం ఫాం ప్రకారం చూస్తే.. ముంబై టెస్ట్ లో సచిన్ ఎక్కువ పరుగులు చేసేలా కనబడటం లేదు. 2011 జనవరి నుండి అతడు ఆడిన 20 ఇన్నింగ్స్ ల్లో రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు. గతేడాది డిసెంబర్ లో కోల్ కతా లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 76 పరుగులు చేశాడు. చెన్నయ్ లో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 81 పరుగులు సాధించాడు.
ముంబై లో సెంచరీ చేస్తే మాత్రం.. సచిన్ కు టెస్టుల్లో 52 వ సెంచరీ అవుతుంది. అయితే ఈరోజు నుండి సచిన్ అభిమానులకు పండగ రోజులే. సచిన్ ఆడే ఆటతీరు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సచిన్ తీసే ఒక్కో పరుగు వెనుక కొన్ని కోట్ల మంది అభిమానులు ఆనందం దాగి ఉంది. ఈ టెస్ట్ లో సచిన్ సరికొత్త రికార్డు స్రుష్టించాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more