కేంద్రం నియమించిన మంత్రుల కమిటీ(జీఎంఓ)కి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఆయా పార్టీలు వారి వాదల్ని వారు వినిపించారు. తెలంగాణకు మద్దతు ఇచ్చే పార్టీలు తెలంగాణకు అనుకూలంగా నివేదికలు ఇవ్వగా, విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి కాంగ్రెస్ వారు సీమాంధ్రకు అనుకూలంగా తమ వాదల్ని వినిపించారు.
అధికార పార్టీ కాంగ్రెస్ వారు మాత్రం రెండు విభిన్న వాదల్ని వినిపించారు. అధికార పార్టీ నుండి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ తెలంగాణకు అనుకూలంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేయగా, విభజనకు వ్యతిరేకంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మంత్రి వట్టివసంత కుమార్ తమ వాదలన్ని వినిపించారు. హైదరాబాద్ను యూటీగానో, ఉమ్మడిరాజధానిగానో చేసేందుకు తాము ఒప్పుకోమని, ఆదాయ పంపిణీ కుదరదు. శాంతిభద్రతలు సహా అన్ని అధికారాలు రాష్ట్రం చేతిలోనే ఉండాలి.
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. తాము రాష్ట్ర విభజనకు అనుకూలమని, శీతాకాల సమావేశాల్లో బిల్లు పెడితే మద్దతిస్తామని, సీమాంధ్రుల్లో ఉండే అపోహలు, ఆందోళనలు తొలగించాలని బీజేపీ తరుపున కిషన్ రెడ్డి నివేదిక ఇవ్వగా, సంపూర్ణ తెలంగాణే తమ లక్ష్యమని, షరతులను తాము అంగీకరించబోమని, తెలంగాణ అధికారాల్లో వేలు పెట్టరాదని, హైదరాబాద్ ఉమ్మడిరాజధానిగా ఐదేళ్లు చాలని, హైదరాబాద్ ఆదాయం పంపిణీకి అంగీకరించబోమని, భద్రాచలం తెలంగాణలోనే ఉండాలని, సీమాంధ్రలోని అక్రమ ప్రాజెక్టులకు నీరు ఇచ్చేందుకు ఒప్పుకోమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ వాదాన్ని వినిపించారు.
శాంతిభద్రతలు కేంద్రం చేతిలో ఉండాలని, రెండు రాష్ట్రాల్లోనూ 371-డి కొనసాగాలని, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం తగదని, జలాలపై నిపుణుల కమిటీ, సంయుక్త మండలి ఏర్పాటు చేయాలని సీపీఐ కార్యదర్శి నారాయణ కోరారు. పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కేంద్రహోంమంత్రి షిండేకు ప్రత్యేక నివేదికను సమర్పించడం విశేషం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more