ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్వీజయ్సింగ్ ఝలక్ ఇచ్చారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే అంతిమమని తెగేసి చెప్పారు. ఢిల్లీలో మాట్లాడిన దిగ్విజయ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అధినాయకత్వం వైఖరిని మరోమారు కుండబద్దలు కొట్టారు. సీఎం కిరణ్ కరుడుకట్టిన కాంగ్రెస్ వాది అంటూనే విభజనపై సీఎంకు అభ్యంతరాలు ఉండవచ్చునని వాటిని పరిష్కరించే దిశగా తాము చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
అయితే కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యుసీ నిర్ణయం ఫైనల్ అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి కిరణ్ ఎంతమాత్రం అతీతుడు కాదని తేల్చి చెప్పారు. విభజనపై ముఖ్యమంత్రి చల్లబడ్డారని ఆయనను పార్టీ అధినాయకత్వం ఒప్పించిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు దిగ్విజయ్ వైవిధంగా స్పందించారు. విభజనను కిరణ్ వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సిడబ్ల్యూసి సుప్రీం అని, అందువల్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉండాలని సిఎం కిరణ్ కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదించక తప్పదని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సజావుగా సాగుతోందని, ఈనెలాఖరులో రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని చెప్పారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడతారన్నది అవాస్తవమని చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని, ఎక్కడికీ వెళ్లరని జోస్యం చెప్పారు. అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే విభజనపై నిర్ణయం జరిగిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిడబ్ల్యుసీ అత్యున్నతమైందని, ఈ కమిటీ తీసుకున్న నిర్ణయంకన్నా ఎవరూ ఎక్కువ కాదని ఆయన వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more