‘‘ అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ దీవించి .. పంపవమ్మ’.. మోక్కే దైవం నీవమ్మ.. కరుణించి ఎలవమ్మా ’’ అంటూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కి హారతులు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని తెలంగాణ నాయకులు కోలుస్తున్నారు. కానీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మాత్రం కొంచెం విరుద్దంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందని తెలంగాణ ప్రజలు, తెలంగాణఱ నాయకులు పండగ చేసుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో.. జైపాల్ రెడ్డి కొత్త కొత్త విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. అసలు తెలంగాణ ఇవ్వటం సోనియాగాంధీకి ఇష్టం లేదని, తప్పని పరిస్థిత్లులో తెలంగాణకు ఒకే చెప్పిందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి చెప్పటం అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది.
రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపాక వ్యతిరేకత వస్తున్నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో జరిగిన రాజీవ్ సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. మతోన్మాదులు శ్రీరామచంద్రుని పేరును కూడా దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. కొన్ని పార్టీలకు ఎన్నికలు వస్తేనే రామమందిరం గుర్తుకు వస్తుందంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశిస్తూ విమర్శించారు. మతం పేరిట మోసం చేస్తూ విభజించి పాలించాలని చూస్తున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ను నిర్మించినవారే తీసుకువెళ్లలేదని, సీమాంధ్రులు ఏమి చేస్తారని వ్యాఖ్యానించారు. తెలంగాణ, సీమాంధ్ర మధ్య సద్భావన పెంచాలని మంత్రి అన్నారు.
జైపాల్ రెడ్డి సినియర్ నాయకుడు.. ప్రత్యేక తెలంగాణ కోసం కేంద్రంలో చక్రం తిప్పిన వ్యక్తిగా పేరుంది. కానీ ఇలాంటి సమయంలో ఆయన తెలంగాణ పై చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఇవ్వటం ఇష్టంలేని సోనియాగాంధీ. మరీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇస్తుందో జైపాల్ రెడ్డి చెప్పి ఉంటే తెలుగు ప్రజలకు పూర్తిగా అర్థమైది. కానీ అసలు రహస్యం చెప్పకుండా.. దాచిపెట్టడంపై కొత్త అనుమానాలు తెలంగాణ ప్రజలకు రేకేత్తున్నాయి. ఏమైన రాష్ట్ర విభజన పై పూర్తిగా తెలియలంటే.. మరి కొద్దిరోజులు ఆగాల్సిందే...
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more