కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన విషయంలో తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకొని పోతుండటంతో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎంపీలు కాంగ్రెస్ అధిష్టానంతో అమీతుమీ తేల్చుకోలేక చితికల పడి చివరికి కాళ్ళ బేరానికి వచ్చినట్లు కనిపిస్తుంది. ఎన్ని సమ్మెలు, ఉద్యమాలు చేసినా, రాజీనామా అస్త్రాలు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో విభజన అనివార్యం అయిన నేపథ్యంలో ‘కులం చెడినా సుఖం దక్కాలి ’ అనే సామెత మాదిరి సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్రం నియమించిన మంత్రుల బృందంలోని సభ్యులు అయిన సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోనీ, మొయిలీలను కలిశారు. వారిని కలిసిన వారిలో కేంద్రమంత్రులు పళ్లంరాజు, కావూరు సాంబశివరావు, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశ రెడ్డి, కిల్లి కృపారాణి తదితరులు ఉన్నారు. తమ డిమాండ్లను వారి ముందు విన్నవించుకున్నారు. దాదాపు గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో ముఖ్యంగా సీమాంధ్రకు ప్యాకేజీ, కొత్త రాజధాని నిర్మాణానికి సహాయం, ఇతరత్రా అంశాలపై ఒక నివేదిక సమర్పించినట్లు తెలిసింది.
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కోరగా వారు ఏ మాత్రం సాధ్యం కాదని, ఒక్కసారి విభజన పై నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. విభజన తర్వాత కొత్తగా ఏర్పడే రాష్ట్రం ఆంధ్రప్రదేశే అవుతుందని, రాజధానితో సహా అన్ని వసతులు కొత్తగా కల్పించుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర నేతలు ఆంటోనీ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి మంత్రులు సుఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదే సమయంలో ఆంటోనీ 'సున్నితంగా చురకలూ' అంటించినట్లు తెలిసింది.
‘సీపీఎం, ఎంఐఎం ’ మినహా మిగిలిన పార్టీలన్నీ విభజనకు అంగీకరించాయి. చివరగా నిర్ణయం తీసుకున్నది మనమే. ఈ విషయాన్ని మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అనడంతో మంత్రుల నుండి సమాధానం కరువయ్యింది. మరి సీమాంధ్రుల డిమాండ్లను పరిష్కరించిన తరువాతనే విభజన పై ముందుకు వెళుతుందా ? లేక విభజించాకే ఈ డిమాండ్లను పరిష్కరిస్తుందో చూడాలి.
సీమాంధ్ర మంత్రుల డిమాండ్లు :
హైదరాబాద్లోని సీమాంధ్రుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలి.
గ్రేటర్ హైదరాబాద్ను కేంద్ర పాలితప్రాంతం (యూటీ) చేయాలి.
ఉద్యోగుల ప్రయోజనాలు, సర్వీసు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు.
సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలి.
విభజన తర్వాత ఏర్పడే కొత్త రాష్ట్రం సీమాంధ్ర ప్రాంతమే అవుతుంది. అందువల్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more