తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే దూకుడు పెంచాడు. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులపై టీఆరఎస్ ఎమ్మెల్యే మాటల దూకుడు పెంచాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంపీ లగడపాటి రాజగోపాల్ భరతం పడతామని, ల్యాంకో అక్రమాలపై విచారణ జరిపి ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మంతా కక్కించి, కటకటాల వెనక్కు పంపిస్తామని టీఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీశ్రావు హెచ్చరించారు.
లగడపాటికి దమ్ముంటే.. ల్యాంకో వ్యవహారాలపై బహిరంగ చర్చకు రావాలని, విజయవాడలోనే వేదిక సిద్ధంచేసి, తేదీ నిర్ణయించాలని హరీష్ సవాల్ చేశారు. తెలంగాణ ఏర్పడితే దోపిడీకి అవకాశం ఉండదనే భయంతోనే.. లగడపాటి సమైక్యాంధ్ర ఉద్యమం అంటున్నాడని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండి, తెలుగు ప్రజలు చీకట్లో ఉంటే... ల్యాంకోలో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇతర రాష్ట్రాలకు ఎలా అమ్ముకున్నారు? అని ప్రశ్నించారు. సమ్మెతో రూ.వంద కోట్లు సంపాదించిన ఘనత లగడపాటే దక్కిందని అన్నారు.
ఇలాంటి దోపిడీ దొంగల మీద ఉద్యమం చేయాలని సీమాంధ్రులకు హితవు పలికారు. రూ.900 కోట్లు తాగునీటికి, రూ.187 కోట్లు మహిళా మెడికల్ కళాశాలకు ఎలాంటి కేబినెట్, శాసనసభ తీర్మానం లేకుండా సీఎం కిరణ్ చిత్తూరు జిల్లాకు నిధులు తీసుకెళ్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైకోర్టుకు వెళ్తామని చెప్పారు. సీమాంధ్ర నాయకులు విభజనకు సహకరించాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి అందరం కలిసి పాటుపడదామని కోరారు.
రాజకీయ నాయకులు ఇలా భరితెగించి.. అంతు చూస్తాం, భరతం పడతం అని హెచ్చరికలు చేయటం, మీడియా ముందు పౌరుషంగా మాట్లాడటంతో.. రెండు ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు పెరుగుతాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా తెలంగాణ ప్రజలకు మేలు చేయ్యాలనే ఉద్దేశంతో.. హరిశ్ రావు అలా మాట్లాడి ఉండటం సహజమే.కానీ ప్రజలు మాత్రం ఆ ప్రకటనలు మరోలా రీసివ్ చేసుకుంటారు. హైదరాబాద్ లో ఉన్న ఒక్క లగడపాటి మాత్రమే కాదు.. అనేక మంది సీమాంద్ర నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. మీరు చేసిన ఈ హెచ్చరిక.. మిగత సీమాంద్ర వ్యాపారస్తులను, హైదరాబాద్ లో ఉంటున్న సీమాంద్ర ప్రజలను తాకుతుంది. సీమాంద్ర ప్రజలను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటాం. వారికి ఎలాంటి భయం లేదని ఒకపక్క హామిలీస్తునే.. మరో ఇలాంటి ప్రకటన చేయటం వెనక ఉన్న అర్థం ఏమిటో? మీరే చెప్పాలి.
రాజకీయ నాయకుల మద్య నడిసే శత్రుత్వం అనేది నీటి మీద బుడగ లాంటిది . దానికి ఉదహారణ.. గతంలో మీ మేనమామ కేసిఆర్.. లగడపాటిల మద్య నడిచిన తిట్ల పురాణంలో చివరిగా ఏం జరిగిందో తెలియాదా? ఒకరికొకరు.. ఐ లవ్ చెప్పుకొని.. ప్రజలను వెర్రివాళ్లను చేసిన విషయం తెలిసిందే. ఏమైన హరిశ్ రావు గారు ఒక విషయం తెలుసుకోవాలి.. ‘‘ఇల్లు అలకగానే.. పండగ కాదు ’’ అలాగే తెలంగాణ వస్తే.. సీమాంద్ర నాయకులపై ఎలా పగ తీర్చుకోవాలి.. వారిని నుంచి ఎలా కోట్లు కక్కించాలి అనే దాని పై కంటే.. తెలంగాణ వస్తే.. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఏం చెయ్యాలి? తెలంగాణలో ఉన్న పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎలాంటి ఉపాది కల్పించాలి అనే దాని పై ప్రణాళిక సిద్దం చేయటం వల్ల .. తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more