ఈ మద్య కాలంలో బెదిరింపులు ఎక్కువైతున్నాయి. మనిషి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఇటీవల ఉగ్రవాదులు ఇండియాలో ఉన్న ఆలయాల్ని టార్గెట్ చేసుకున్నారు. రీసెంట్ చిత్తూరు జిల్లా పుత్తూరులో దొరికిన ఉగ్రవాదుల టార్గెట్ కూడా తిరుపతి ఆలయమే కావటం విశేషం. ముందుగానే పోలీసులు వారిని పోట్టుకోవటంతో.. వారి ప్లాన్ ఏమిటో తెలిసిపోయింది. లేకపోతే పరిస్థితి ఏమిటో ఊహించటానికి భయంకరంగా ఉంది. అయితే ఇప్పుడు అతి పవిత్రమైన షిర్డీ ఆలయం పై ఉగ్రవాదుల కన్ను పడింది. షిర్డీ ఆలయాన్ని నవంబర్ 9వ తేదీన పేల్చేస్తామంటూ షిర్డీ ట్రస్ట్కు బెదరింపు లేఖ రావటం జరిగింది. షిర్డీ ఆలయంతో పాటు .. ముంబయిలోని శివసేన్ నివాసం మాతాశ్రీని, బాలాథాకరే సమాధిని బాంబులతో పేల్చివేస్తామంటూ బెదిరింపు లేఖ రావటంతో ముంబయి వాసులు, శివసేన అభిమానులు భయందోళన చెందుతున్నారు.
దీంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ లేఖ ఈనెల 14వ తేదిన షిర్డి సాయి సంస్థాన్ ట్రస్టు కార్యనిర్వహణాధికారి అజయ్ మోరే కార్యాలయానికి పోస్టు ద్వారా వచ్చింది. ఆ కవరు పై అహ్మద్ నగర్, షిర్డీ పోస్టాఫీసు ముద్రలున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆలేఖలో ఎన్ని గంటలకు పేల్చటం అనేది కూడా వివరంగా రాయటం జరిగింది. షిర్డి సాయిబాబా మందిర్ , ముంబయి ధాదర్ లోని శివసేన ప్రధాన కార్యాలయం సేన భవన్ ను నవంబర్ 9, 2013 రాత్రి 9.11 గంటలకు, 9.22 గంటలకు అంటే 11 నిమిషాల వ్యవదిలో పేల్చేస్తామనే హెచ్చరికలు చేయటం జరిగింది. అంతేకాకుండా ఇండోర్ లోని గణపతి ఆలయాన్ని సైతం పేల్చేస్తాం అంటూ లేఖలో రాయటం విశేషం. ఈ లేఖ కు సంబంధించిన వివరాలు అనేది ఏ ఉగ్రవాది సంస్థ పేరు మాత్రం లేదు. కానీ ‘ఇస్లామ్ జిందాబాద్ ’ , పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు లేఖ లో ఉండటంతో.. ఈ విషయాన్ని పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు.
ఇప్పటికే ఉగ్రవాదల హిట్ లిస్ట్ లో షిర్డిసాయిబాబా మందిరం ఉన్నవిషయం తెలిసిందే. అయితే కొత్తగా.. బాల్ థాకరే సమాధి, ఆయన నివాసం మాతోశ్రీ, ఇండోర్ లోని గణపతి ఆలయం ఉగ్రవాదుల లిస్ట్ లో చేరటంతో.. ప్రజలు భయపడుతున్నారు. తేది, సమయం, ప్లేస్ అన్ని ముందుగానే చెప్పి , పేల్చాటానికి సిద్దంగా ఉన్నాం అని ఉగ్రవాదులు హెచ్చరికలు చేయటం చూస్తే.. మన భద్రత లో డొల్లతనం ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. ఒకేసారి, ఒకే రోజు .. ఒకే సమయంలో అన్ని ప్రదేశాల్లో బాంబులు పేల్చుతాం అని చెప్పటమే .. అందరికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కంటికి కనిపించకుండా.. ఉండే ఉగ్రవాదులు .. బాంబులు పేల్చతాం అంటూ.. బహిరంగంగా సవాల్ విసురుతున్నారు. అంటే మన కళ్ల ముందే కనిపిస్తూ.. , నిత్యం డ్యూటీ చేస్తూ ఉన్న పోలీసులకు ..ఇది ఒక పెద్ద సవాల్ గా మారింది.
అసలు ఇలాంటి బెదిరింపులు లేఖలు ఎందుకు వస్తున్నాయి. బాంబులతో ఆలయాన్ని పేల్చితే ఉగ్రవాదులకు వచ్చే లాభం ఏమిటి? వారి లక్ష్యం ఒక్కటే.. భారతీయ ప్రజలను అధిక సంఖ్యలో చంపటమే వారి ద్వేయం. ఇలాంటి ఉగ్రవాదులకు శ్వాశత నిర్ములణ అనేది ఉండదా? వీరికి అడ్డుకట్టే వేసేది ఎలా? ఈ రోజు షిర్డి, రేపు.. మరో టెంపుల్, ఇలా ఎన్ని రోజులు? ఎలా ఎంత మంది బలికావాలి? బెదిరింపు లేఖలు వచ్చిప్పుడు భారీ బలగాలతో భద్రతపై ద్రుష్టి పెట్టడం.. కొన్ని రోజులు షర మాములే అవుతుంది. దీంతో ఉగ్రవాదులకు బాగా కలిసివస్తుంది. ఇప్పటికే అనేక ఆలయాల వద్ద.. భారీ భద్రత ఏర్పాటు చేయటం జరిగింది. అయిన ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు.
ఇలాంటి ఉగ్రవాదుల సంస్థలను లేకుండా చేస్తేనే ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, భారీ నష్టం జరగకుండా ఉంటుందని .. దేశ ప్రజలు అంటున్నారు. అయిన పోలీసులు కూడా ప్రాణమున్న మనుషులే.. వారి ప్రాణాలను పణ్ణంగా పెట్టి.. ప్రజలను కాపాడటం అంటే.. సామాన్యమైన విషయం కాదు. పోలీసులు చివరి ప్రాణం ఉన్నంత వరకు ..ప్రజలను కాపాడతారు.. ఇక ఆ తరువాత ఆ షిర్డీ సాయిబాబా ఇష్టం.. ‘‘ నారు పోసిన వాడు నీరు పోయకుండా పోతాడ ’’ మనిషికి జీవం పోసిన ఆ సాయి నాధుడే.. అందరికి రక్ష..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more