సమైక్యాంద్ర కోరుతూ త్వరలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షడు వైఎస్ జగన్ ప్రకటించారు. కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలని, కేబినెట్ నోట్ తయారయ్యాక ఇక అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యం ఉండదని జగన్ అన్నారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ జైలు నుండి వచ్చిన తరువాత మొదటి సారిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో జగన్ సమైక్యాంద్ర పై కొన్ని విషయాలను బయటపెట్టారు.
ఏ) సమైక్య శంఖారావం పేరుతో హైదరాబాద్ లో 15 -20 తేదీలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. నిజాయితో కూడిన రాజకీయ వ్యవస్థ అవసరం. సమైక్యానికి కట్టుబడుతూ లేఖ రాయండి. మొదటి సంతకం నేను పెడతాను. ఇప్పుడు మూడు పార్టీలు ఉన్నాయి. ఇది మొదలు పెడితే నాలుగు, అయిదు పార్టీలుగా పెరుగుతాయి. అలా చేస్తేనే రాష్ట్రం విడిపోకుండా ఆపగలుగుతాము. ప్రతి రాజకీయ పార్టీని ప్రశ్నించండి. సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇవ్వనప్పుడు సమైక్య ఉద్యమంలో ఎలా పాల్గొంటారని అడగండి.
బి) 50 శాతం బడ్జెట్ హైదరాబాద్ నుంచే వస్తోంది. దీనిని వదిలిపెడితే ఎలా? పదేళ్లలో మరో రాజధాని కట్టుకోవడం సాధ్యమేనా? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. చదువు పూర్తి చేసిన పిల్లవాడు ఉద్యోగం చూసేది హైదరాబాద్ వైపే. 60 శాతం మంది ప్రజలు అన్యాయం జరుగుతోందని రోడ్డు ఎక్కారు. ప్రజల మనసులలో కలసి ఉండాలన్న భావనను ఎవరూ తీసివేయలేరు.
సి) రాష్ట్రం సమైక్యంగా ఉన్న పరిస్థితులలోనే నీటి సమస్య ఉంది. మధ్యలో మరో రాష్ట్రం వస్తే నీరు సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించడంన్నారు. మంచి నీటి కోసం కొట్టుకునే పరిస్థితికి తీసుకువెళుతున్నారు.అన్ని జిల్లాల వారు నీటి కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామంటున్నారు. రాష్ట్రాన్ని విడగొడితే పోలవరానికి నీళ్లు ఎక్కడ నుంచి ఇస్తారు?
డి) వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి మనసా వాచా కట్టుబడి ఉన్నాయి. మిగిలిన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. ఒక తండ్రిగా ఆలోచించి న్యాయం చేయాలి. తండ్రి వద్దకు కూతురు గానీ, కొడుకు గానీ వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని చెబితే వినే పరిస్థితిలో తండ్రి ఉండాలి. ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ పార్టీలు అన్యాయం జరుగుతుందని అడగడంలేదు.
ఇ) కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ సీపీకి డీల్ ఉందని చంద్రబాబు అండ్ కో అంటున్నారు.. నిజంగా డీల్ ఉంటే మూడు నెలలలో రావలసిన బెయిలు రావడానికి 16 నెలల సమయం ఎలా పడుతుంది? రాజ్యాంగం ప్రకారం విచారణ పూర్తికాని పక్షంలో మూడు నెలల్లోనే బెయిలు రావాలి.
వైఎస్ జగన్ హైదరాబాద్ లో సమైక్యాంద్ర సభ జరిపితే మాత్రం రాజకీయ ఇమేజ్ పేరుగుతుంది. అంతేకాకుండా.. సమైక్యాంద్ర ఉద్యమానికి బలమైన రాజకీయ నాయకుడు దొరుకుతాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే జగన్ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. హైదాబాద్ లో జరిగే సమైక్యాంద్ర భారీ సభకు .. హైదరాబాదులో ఉండే.. ప్రజల నుండి కూడా సపోర్టు లభిస్తుందని పార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఏమైన జగన్ సమైక్యాంద్ర సభ వలన రాజకీయ పార్టీల్లో ఒక పెనుమార్పు తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more