కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు తమ రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని ఆగ్రహంతో కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట లోక్సభ సభ్యుడు సాయిప్రతాప్ ఊగిపోయారు. తామేం చేసినా చెల్లుబాటవుతుందన్న గర్వంతో అధినాయకత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటిదాకా నెహ్రూ, ఇందిర, రాజీవ్, సోనియా పేర్లతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగామని, ఇకముందు ఓట్ల కోసం ఎవరి పేర్లు చెప్పి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. కాంగ్రెస్లోని కొందరు అగ్రనేతలు పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తప్పుడు సమాచారమిచ్చి ఆమెతో రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టడానికి కారకులయ్యారని ఆరోపించారు. రాజీనామాలపై సమిష్టిగా నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారని, అందుకే తాము కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గామని పేర్కొన్నారు. అధినాయకత్వం తరచూ ఆంటోని కమిటీ, షిండే కమిటీ అంటూ తమను బెదిరిస్తోందని, తామందరముంటేనే కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యాంధ్రను కోరుకుంటున్నారని, తెలంగాణలోని మెజారిటీ ప్రజలు సైతం సమైక్య రాష్ట్రం కొనసాగాలనే అభిప్రాయంతో ఉన్నారని గుర్తు చేశారు. అయితే ప్రజలు భయపడి ఈ విషయంలో బయటపడడంలేదని ఆయన చెప్పారు. ఈ అంశంపై సర్వే నిర్వహిస్తే అసలు విషయం బయటపడుతుందని ఆయన చెప్పారు.
అభ్యర్థి ఎవరైనా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారన్న ధీమాలో అధినాయకత్వం ఉందని అందుకే ఎవరేమీ చెప్పినా వినకుండా పార్టీ పెద్దలు ముందుకు సాగుతున్నారని తెలిపారు. పార్టీ అభ్యున్నతికి దశాబ్దాలుగా సేవలు చేస్తున్న తమను కాదని, ఎవరో చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ ముందుకు సాగుతోందని దుయ్యబట్టారు. పార్టీ కొందరి స్వార్థం కోసం విభజన నిర్ణయాన్ని చేశారని ప్రజలు భావిస్తుండగా, మరికొంత మంది మాత్రం వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకో విభజన నిర్ణయాన్ని ప్రకటించారని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. తాము ప్రజల వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామని, ఈ పరిస్థితిలో పార్టీ ముందుకు ఎలా సాగుతుందని ప్రశ్నించారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని దీంతో చరిత్రలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. సాయిప్రతాప్ ఉన్నట్టుండి అధినాయకత్వంపై పరుషపదజాలాన్ని ప్రయోగించడం కాంగ్రెస్ వర్గాలను ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది. పార్టీని వీడి తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్టు సాయిప్రతాప్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2014లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశంలేదని చెప్పారు. 90 రోజుల్లో తెలంగాణ బిల్లు ఏర్పాటు సాధ్యంకాదని ఆయన జోస్యం చెప్పారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించినా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్కు సీట్లు వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more