చిత్తూరు సార్ లో సమైక్యవాదం చాలా బలంగా ఉందనే విషయం రీసెంట్ గానే తెలిసింది. అయితే చిత్తూరు సార్ మౌనంలో మాత్రం మన ప్రధాని మన్మోహన్ సింగ్ తరువాతనే కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయ్యో ఇంతకీ మన చిత్తూరు ఎవరు చెప్పలేదు కదు. చిత్తూరు సార్ అంటే నిజానికి ఇద్దరు వస్తారు. ఒకరు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, మరో అధికారపక్షంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. నారా వారి సార్ కు క్రికెట్ రాదు.. ఆయన కు హైటెక్ హంగులు గురించే తెలుసు. ఇక నల్లారి సార్ కు మాత్రం క్రికెట్ గురించి బాగా తెలుసు. ఏ బంతిని ఎలా కొట్టాలో, ఏ బంతిని బౌండరీకి పంపించలో, ఎప్పుడు సిక్స్ కొట్టాలో, ఎప్పుడు ఫోర్ కొట్టాలో , ఎప్పుడు బంతిని వదిలిపెట్టాలో అనే విషయాల్లో నల్లారి సార్ ఆరితేరిపోయారు. అందుకే ఇప్పుడు చిత్తూరు సార్ సమైక్యాంద్ర ఉద్యమం కోసం రంగంలోకి దిగారు. సమైక్యాంద్ర మ్యాచ్ ఇప్పుడే మొదలైందని, చివరి బంతి పడేవరకు మ్యాచ్ ముగియదని.. నల్లారి సార్ బలంగా మీడియా ముందు చెప్పటం జరిగింది. సీఎం కూర్చీలో కూర్చున్నప్పటి నుండి నల్లారి సార్ మ్యాచ్ ఆడుతునే ఉన్నారు. చిత్తూరు సార్ దెబ్బకు కొన్ని బంతులు బౌండరీ దాటి.. గ్యాలరీలోకి వెళ్లి కూర్చున్నాయి. మరికొన్ని బంతులు .. చిత్తూరు సార్ ను అవుట్ చెయ్యటానికి తీవ్రమైన పోరాటం సాగిస్తున్నాయి. ఇలాంటి బంతులకు చిత్తూరు సార్ ఒక షాకిచ్చారు. సమైక్యాంద్ర కోసం చిత్తూరు సార్ రంగంలోకి మ్యాచ్ ను మొదలు పెట్టారు.
రాజకీయ సమీకరణల కన్నా.. నాకు రాష్ట్రమే ముఖ్యం, ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం చాలా అవసరమని చెప్పారు. సీమాంద్రలో అందోళనలను కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలన్నారు. పార్టీలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఈ అంశంలో పార్టీల కన్నా ప్రజాందోళనలే ముఖ్యమన్నారు. పార్టీలు ప్రజాభిష్టానికి అనుగుణంగా పనిచేయాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఆందోళన చేస్తున్న వారి సమస్యలు , ఇబ్బందులను పరిష్కరించకుండా ముందుకెళ్లడం చాలా కష్టమన్నారు. హైదరాబాద్ అంశంపై ఇంకా చర్చ జరగాల్సి ఉందన్నారు. సీమాంద్ర నేతలమంతా రాష్ట్రాన్ని ఎలా సమైక్యంగా ఉంచాలనే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. నదీజలాల అంశంపై ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో సమస్యలు ఉన్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా నది, ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాలకు సమానంగా విభజించలేదన్నారు. ఒక ప్రాంతంగా ఉంటేనే క్రిష్ణా, గోదావరి జలాలను వాడుకోవచ్చని ఫజల్ అలీ కమిషన్ చెప్పిందని గుర్తు చేశారు. సాగునీటి సమస్యలపై రాష్ట్రాల మద్య వేసిన అన్ని సంఘాలు దారుణంగా విఫలమయ్యాయన్నారు. విద్య, వైద్యం, ఉద్యోగ అంశాలను విభజనకు ముందే పరిష్కరించాలి, తర్వాత సాధ్యపడదని సీఎం వివరించారు. నేను హైదరాబాద్ లోనే పుట్టి, హైదరాబాద్ లోనే పెరిగా.. హైదరాబాద్ మాదే అని చెప్పడం సరికాదు. ఇది ఆంద్రప్రదేశ్ ది అని చెప్పారు. విభజన జరిగితే రెండు ప్రాంతాల్లోనూ లక్షలాది మంది స్థానచలనం చెందాల్సి ఉంటుందన్నారు. రోజు 3,4 లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, 6.5లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. జీతాలు కూడా తీసుకోవట్లేదని సీఎం పేర్కొన్నారు. అయితే సమైక్యాంద్ర జరిగే మ్యాచ్ చివరి బంతి పడేవరకు మా పోరాటం ఆగాదని చిత్తూరు సార్ బలంగా చెప్పటం జరిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more