తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుటుంబంలోని ఆస్తులలో వాటాను ఎవరికైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అస్తుల విలువ మొత్తం 42 కోట్ల రూపాయలు. అలా ఆస్తులలో వాటా గ్రహించటానికి ఒకే ఒక్క
అర్హత ఆయన చెప్పిన లెక్కలు తప్పని నిరూపించటమే అంతే. అంతకంటే ఎక్కువ ఆస్తులున్నాయన్న రుజువులేమైనా ఉంటే బయటపెట్టటమే.
ప్రజాజీవితంలో ఉన్న నాయకులంతా తమ ఆస్తులను వెల్లడి చేయాలన్న చంద్రబాబు తన ఆస్తులను ఈ విధంగా ప్రకటించారు.
చంద్రబాబు నాయుడు పేరు మీద రూ.42 లక్షలు, ఆయన భార్య భువనేశ్వరి పేరు మీదున్న ఆస్తులు రూ.33 కోట్ల 5 లక్షలు.
చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పేరు మీద రూ.4 కోట్ల 93 లక్షలు, ఆయన భార్య బ్రాహ్మణి పేరు మీదున్న ఆస్తులు రూ.3 కోట్ల 31 లక్షలు.
అవినీతి వల్లనే దేశంలో ఆర్థిక సంక్షోభం వాటిల్లిందన్న చంద్రబాబు రాజకీయ నాయకులంతా తమ తమ ఆస్తులను ప్రకటించటం తప్పని సరి చేయాలని కోరుతూ తన సొంత పరిశ్రమ హెరిటేజ్ కంపెనీని పారదర్శకతతో నడుపుతున్నామని చెప్పారు. 1992 లో స్థాపించిన ఆ కంపెనీ అభివృద్ధి చెందిందని, దాని వలన 30 శాతం డివిడెండ్ చెల్లించటం జరిగిందని కూడా ఆయన అన్నారు. దేశంలో అవనీతిని మట్టుపెడితే కానీ పారిశ్రామిక ప్రగతి, రూపాయి విలువ పుంజుకోవటం జరుగుతుందని, హవాలా నిర్వహణలను పూర్తిగా అరికట్టాలని ఆయన అన్నారు.
తాను ప్రకటించిన ఆస్తలు కాక ఇంకా ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే అందులో వాటా ఇస్తానని చంద్రబాబు అన్నారు. ఆయన మీద ఆరోపణలు చేస్తున్నవారికిది ఒక మంచి అవకాశం. చంద్రబాబు కుటుంబ సభ్యులకు అంతకంటే ఎక్కువ ఆస్తులున్నాయని సాక్ష్యాధారాలతో నిరూపించటం వలన వారి ఆరోపణలు సరైనవేనన్న విషయం నిరాధారమైనది కాదన్న విషయం తెలిసి వట్టి ఆరోపణల ద్వారా సాధించలేనిది సాధించవచ్చు. దానితో పాటు ఆ కృషికి ఫలితంగా ఆయన ఆస్తిలో వాటాను కూడా పారితోషికంగా తీసుకోవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more