సమైక్యాంద్ర మద్దతుగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రోజు షర్మిల బస్సుయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరైనారు. అయితే షర్మిల తమ మాటల తూటాలను తెలుగుదేశం పార్టీ మీద ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు యాత్ర చేస్తున్న షర్మిలకు సమైక్య సెగ గట్టిగానే తగిలింది. ఈరోజు పామిడిలో షర్మిల పాదయాత్రను సమైక్యవాదులు అడ్డుకొని షర్మిల గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రకటన వచ్చిన తరువాత సమన్యాయం అని దీక్షలకు దిగి ఆ తరువాత సమైక్యవాదం అందుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తూ తెలంగాణా మీద ఆశలను వదులుకున్న జగన్ అండ్ కో కి ఇది మిగుండుపడని అంశమే. మొత్తానికి సమైక్యవాదుల దెబ్బకు కంగుతిన్న షర్మిల మరో దారిలో కర్నూలు వైపు వెళ్లిపోయారు. ఇక మరోవైపు నెల్లూరు జిల్లాలో వైకాపా సీనియర్ నేత ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురయింది. నెల్లూరులోని సింహ గర్జనకు వచ్చిన మేకపాటిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. సింహ గర్జనలో రాజకీయ నాయకులకు అనుమతి లేదంటూ సమైక్యవాదులు ఆయనను వెనక్కి తిప్పి పంపించారు. రెండు చోట్ల పరాభవంతో వైకాపా షాక్ నిచ్చింది.
ఉండవల్లి ప్రసంగం... తెలంగాణ నేతల్లో భయం
ఇప్పటికే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఎన్నో సభలు నిర్వహించిన ఆయన ఈ రోజు లోక్ సభలో సమైక్య గళాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ వినిపించారు. ఉద్యమాన్ని ఉద్దేశించి లోక్సభలో ప్రసంగించిన ఆయన సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర జిల్లాలో జరుగుతున్న ఉద్యమం దేశంలోనే అతిపెద్ద ఉద్యమం అని ఆయన అన్నారు. రాజధాని ఉన్న ప్రాంతాన్ని విడదీయడం చరిత్రలో ఇదే మొదటిసారి అని ఉండవల్లి తెలిపారు. కాగా ఉండవల్లి ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. సభలో ఉండవల్లి ప్రస్తావిస్తున్న సమయంలో ఎంపీలు అడ్డుకోవడంతో దీనిపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీమాంధ్ర ఎంపీలెవరూ తమ నిరసన తెలపలేదని గుర్తు చేస్తున్నారు. దీంతో సభ కొంత సేపు వాయిదా పడినా ఉండవల్లి మాట్లాడుతూ తాను చిన్నప్పుడు జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లానని, కాని ఇప్పుడు ఉవ్వెత్తున సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని, గతంలో ఎన్నడూ లేని రీతిలో జరుగుతోందని ఆయన అన్నారు. ఆనాడు ముల్కి రూల్స్ కు వ్యతిరేకంగా ఆందోళన వస్తే, ఇప్పుడు విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే భయంతో ఆందోళన వస్తుందన్నారు.
ఇక ఉండవల్లి అడ్డుకున్న తెలంగాణా ఎంపీలపై సమైక్య వాదులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉండవల్లి అంటే తెలంగాణ నేతలందరికీ భయమని, అతను వాదన వినిపించడం మొదలుపెడితే మొదటికే మోసం వస్తుందని తెలంగాణ ఎంపీలు అడ్డంపడ్డారని, ఉండవల్లి వాస్తవాలు మాట్లాడడం మొదలుపెడితే తెలంగాణ కల కల్లగా మిగిలిపోతుందనే భయంతోనే అతని ప్రసంగాన్ని అడ్డుకున్నారని సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more