Pawan kalyan voice calls you to ap ngo meeting on 7th

pawan kalyan voice calls you to AP NGO meeting on 7th, AP NGOs meeting on 7th September, AP NGOs Association, AP NGOs promo video, Powerstar, Pawan Kalyan, AP NGO's samaikhyandhra meeting, Cameraman Ganaga tho Rambabu, Pawan Kalyan dialogues in AP NGOs promo video

pawan kalyan voice calls you to AP NGO meeting on 7th

ఏపీ ఎన్జీవోల సభకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపు

Posted: 09/05/2013 08:46 PM IST
Pawan kalyan voice calls you to ap ngo meeting on 7th

ఎముకులు కుళ్లిన, వయసులు మళ్లిన సోమరిలారా చావండి? అని శ్రీశ్రీ తిట్టింది నిన్నే!

దేవుడా రక్షించు నా దేశాన్ని అని తిలక్ ఏడ్చారా... !

వాడ్ని ఆపటానికి నేను వెళ్లుతున్నా.. !

రేపు నీవు హైదరబాద్ వస్తున్నావ్...!

మనిద్దం కలిసే వెళ్లుతున్నాం....! వస్తున్నవా...లేదా? !

పోరాడితే పోయేది ఏమీలేదురా.. .. ! వేదవ బానిస సంకేళ్లు తప్ప. ..! రా.. రా.. రా... రా..

హైదరాబాద్ నడిబొడ్డున వెయిట్ చేస్తున్నా..! రా..రా... ఈ మాటలు అన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణే. సీమాంద్రలో ఎక్కడ చూసిన ఈ ప్రోమోనే వినబడుతుంది. 

ఈనెల సెప్టెంబర్ 7వ తేదీ పై తెలంగాణ నాయకులు, సీమాంద్ర నాయకులు, ఎపీ ఎన్జీవోలు, తెలంగాణ ఎన్జీవోలు ద్రుష్టి పెట్టారు. సెప్టెంబర్ 7వ తేదీ అందరిలో కలవరం రేపుతుంది. ఎపీ ఎన్జీవోల సభను అట్టుకోవటానికి.. తెలంగాణ ప్రాంత నాయకులు, తెలంగాణ జేఏసీ సంఘాలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు ఎపీ ఎన్జీవోల సభకుకొన్ని షరతులతో కూడిన అనుమతి లభించింది. తెలంగాణ ఎన్జీవోల చేపట్టనున్న మహా శాంతి ర్యాలీకి పోలీసు శాఖ నుండి అనుమతి రాలేదు. ఈ విషయం ఆగ్రహం చెందిన తెలంగాణ నాయకులు, తెలంగాణ ఎన్జీవోలు, తెలంగాణ జేఏసీ సంఘాలు.. సెప్టంబర్ 6వ తేదీ అర్థరాత్రి నుండి తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వటం జరిగింది. బంద్ కు గల కారణం ఒక్కటే.. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా బంద్ కు పిలుపు ఇవ్వటం జరిగింది. కేవలం ఎపీ ఎన్జీవోల సభను అడ్డుకోవటానికే తెలంగాణ బంద్ కు పిలుపు నిచ్చినట్లు గా ఉందని ఎపీ ఎన్జీవోలు అంటున్నారు. అయితే ఎపీ ఎన్జీవోలు ఒక విచిత్రమైన పని చెయ్యటం జరిగింది. సేవ్ సమైక్యంద్ర సభకు టాలీవుడ్ టాప్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిలుపు అంటూ ఒక వీడియోను రిలీజ్ చేయటం జరిగింది.

 

ఆ వీడియోను చూస్తే.. పవన్ కళ్యాణ్ నిజంగానే ఎపీ ఎన్జీవోల సభకు పిలుపునిచ్చారనే విధంగా ఉంది. కానీ రీసెంట్ గా .. తెలంగాణ వాదుల సెగ దెబ్బకు రిలీజ్ అయి నెలరోజులకు ప్రేక్షకులకు కనుమరుగైన..‘‘ కెమెరామెన్ గంగతో రాంబాబు’’. దర్శకుడు పూరీ, పవన్ కళ్యాణ్ , తమన్నా కాంబినేషనల్లో వచ్చిన సినిమా. ఈ సినిమా తెలంగాణ వాదులు కొన్ని అభ్యంతరాలు చెప్పటంతో సినిమా థియేటర్లలో ఆడకుంటానే తీసేసారు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ ఒక విలేకర్. అక్రమా మార్గం నుండి రాజకీయ గద్దెనెక్కిన (ప్రకాశ్ రాజ్ ) రాజకీయ నాయకుడి, ఒక సామాన్య వ్యక్తి జరిగే యుద్దం. ఆ సందర్భంలో.. పవన్ కళ్యాన్ కొన్ని పవర్ పుల్ డైలగ్స్ చెప్పటం జరిగింది. ఆ డైలాగ్స్ ఇప్పుడు ఎపీ ఎన్జీవోల సభకు ఉపయోగించుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగా అయితే సభకు ఎలాంటి డైలాగ్స్ చెప్పలేదు. ఈ ప్రోమోను ఎవరు రిలీజ్ చేశారో తెలియాదు కానీ, మొత్తం మీద పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని ప్రోమో..ఏపీ ఎన్జీవోలు ఇలా ఉపయోగించుకున్నారు. అయితే ఇలా చెయ్యటం వల్ల అధిక నష్టం ఉంది. కొంత లాభం ఉంది. ఈ ప్రోమో వలన పవన్ కళ్యాణ్ కు భారీ నష్టం జరుగుతుంది.

 

ఇప్పటికే సమైక్యాంద్ర సెగ తో మెగా సినిమాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. సమైక్యాంద్ర సభ కోసం ఒక స్టార్ హీరోను బలి చెయ్యటం ఎంతవరకు సబబు చెప్పండి. ఈ ప్రోమోతో తెలంగాణ ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ ను దూరం చేసినట్లు కనబడుతుంది. ఇప్పటికే సీమాంద్రలో మెగా హీరోల పై సీమాంద్ర ప్రజలు ఆవేశంగా ఉన్న విషయం తెలిసింది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాన్ నటించిన సినిమా నుండి విడుదలైన ప్రోమోను ఒక ప్రాంత సభకు ఉపయోగించటం పై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. సీమాంద్ర ప్రజలకు ఆనందంగా ఉన్నప్పటికి.. తెలంగాణ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ పై ఊగిపోతున్నారు. ఈ ప్రోమో పై మెగా హీరోలు, మెగా అభిమానులు ఎలాంటి కామెంట్స్ చేస్తారో చూడాలి. హీరోలను రాజకీయాలకు వాడుకుంటే.... వారిజీవితం పై ఎఫెక్ట్ పడుతుందనే విషయం ఎలా మరిచిపోయారో అనేది తెలియాలి. వినటానికి , చూడటానికి బాగున్నప్పటకి.. దీని వల్ల జరిగే నష్టం మాత్రం ఒక్క పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది అనేది పచ్చి నిజం. ఫలితం మీకు.. పనిష్ మెంట్ పవన్ కళ్యాణ్ కు పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more