సమైక్యాంధ్ర కోసం ఏడు రోజులుగా వైఎస్ జగన్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న దీక్షను బలవంతంగా భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బలవంతంగా నిమ్స్ వైద్యలు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. జగన్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించటంతో 151 గంటలుగా ఆయన చేస్తున్న దీక్షను వైద్యులు బలవంతంగా భగ్నం చేయటం జరిగింది. నలుగురు వ్యక్తులు పట్టుకుని ఆయనకు బలవంతంగా ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కించారు. దాంతో జగన్ మత్తులోకి వెళ్లిపోయారు. జైలు అధికారుల నుంచి ఆదేశాలను, మార్గదర్శక సూత్రాలను అందుకుని జగన్ దీక్షను భగ్నం చేశారు. వైయస్ జగన్కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించనున్నట్లు నిమ్స్ వైద్యుడు నగేష్ అంతకు మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోందని, ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే ప్రమాదం సంభవిస్తుందని తాము జైలు అధికారులకు తెలిపామని, దాంతో 593 నిబంధనల ప్రకారం జగన్కు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ఆదేశాలు వచ్చాయని ఆయన వివరించారు. దీక్షను భగ్నం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని ఆయన చెప్పారు. వైయస్ జగన్ వైద్యానికి నిరాకరిస్తున్నారని, అందువల్ల బలవంతంగా వైద్యం అందించడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. బిపి, పల్స్ పడిపోతున్నాయని ఆయన చెప్పారు. అరగంటలోపే ఆయనకు బలవంతంగా ఐబి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more