సీమాంద్ర ఉద్యమానికి రోజులుపోయి, నెల నిండి బాలుడుగా రూపుదిద్దుకున్నాడు. రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి తెలంగాణ ప్రాంతంలో ఆనందం చోటుచేసుకుంది. సీమాంద్రలో మాత్రం ఉద్యమం ఊపిరిపోసుకుంది. సిడబ్ల్యూసి చేసిన తీర్మానం పై సీమాంద్ర నాయకులు సైలెంట్ గా ఏసీ గదుల్లో చర్చలు జరుపుకున్నారు. తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు ఏర్పాడుతున్నాయి కాబట్టి, సీమాంద్ర నాయకులు రాజకీయ భవిష్యత్తు గురించి రంగు రంగుల కలలు కనేపనిలో ఇప్పటి బిజీగానే ఉన్నారు. కానీ సీమాంద్ర ప్రజలు, ఉద్యోగులు, మేథావులు, విద్యార్థులు, వర్తక సంఘాలు, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చెపట్టారు. అయితే వీరి వెనుక ఏ రాజకీయ నాయకుడు లేడు? ఏ రాజకీయ పార్టీ లేదు? ప్రజలే స్వచ్చందంగా ఉద్యమలోకి దిగటం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సీమాంద్ర ప్రజలు ఉద్యమాన్ని తీవ్రస్తాయికి చేర్చాటం జరిగింది. నేటి ముప్పై ఒక్క రోజుకి సీమాంద్ర ఉద్యమం చేరుకుంది. అయితే ఇప్పటి వరకు అటూ కేంద్రంలోను, ఇటూ రాష్ట్ర ప్రభుత్వంలోను ఎలాంటి చలనం రాలేదు. నెల రోజుల నుండి సీమాంద్రంలో ప్రభుత్వ పాలన పడకేసిన విషయం తెలిసిందే.
దీనిపై ప్రభుత్వంగానీ, కేంద్రం గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొంతమంది మాత్రం సీమాంద్ర ఉద్యమాన్ని పాలపొంగుతో పోల్చీ ఢిల్లీ పెద్దల నుండి పదవులు పొందుతున్నారు. అయితే సీమాంద్ర ప్రజలు మాత్రం రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది. రాజీనామా చేసిన సీమాంద్ర నాయకులే ఉద్యమంలోకి రావాలని సీమాంద్ర ప్రజలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమంది సీమాంద్ర నాయకులకు ఉద్యమ సెగ ఏమిటో సీమాంద్ర ప్రజలు చూపించారు. ఉద్యమం తారస్థాయికి చేరుతున్న తరుణంలో .. ప్రజలే ప్రభువులు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా సమైక్యంద్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వటంతో.. సీమాంద్ర ప్రజలు చేసే ఉద్యమానికి బలం చేకూరింది. ఈ నెల రోజుల్లో తెలంగాణ ప్రాంత నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యటం వలనే సీమాంద్ర ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుందని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు.
కానీ ఆ మాటల్లో నిజంలేదని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. ప్రజలే స్వయంగా ఉద్యమంలోకి వస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు అండతో, ఈ రాజకీయ పార్టీ అండతో పుట్టిన ఉద్యమం కాదని, సీమాంద్రప్రజలు అంటున్నారు. సీమాంద్ర ప్రజల గుండెల నుండి ఉద్యమం అని అంటున్నారు. కేంద్రం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు సీమాంద్ర ఉద్యమం చేస్తామని సీమాంద్ర ప్రజలు అంటున్నారు. సమైక్యాంద్ర ఉద్యమం సెగ ఢిల్లీ పెద్దలకు సైతం తాకింది. పాలన స్థభించిపోయినప్పటికి కేంద్రప్రభుత్వలో చలనం రాలేదు. నాలుగు కోట్లు మంది ప్రజలు రాష్ట్ర కావాలని అడిగితే రాష్ట్రం ఇస్తారా? అయితే 8 కోట్లు మంది రాష్ట్రాన్ని సమైక్యాంగా ఉంచాలని కోరుతున్న దాని పై కేంద్రం ఎందుకు స్పందించటంలేదని సీమాంద్ర ప్రజలు అడుగుతున్నారు. సీమాంద్ర ఉద్యమం రూపాన్ని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నఎల్బీ స్టేడియంలో చూపించాటానికి సిద్దమవుతున్నారు. సెప్టెంబర్ 7న జరిగే సీమాంద్ర సభకు సీమాంద్ర ప్రజలు భారీ తరలివస్తారని ఎపీ ఎన్జీవో ఉద్యోగులు చెబుతున్నారు. కేంద్రం ఎప్పుడు స్పందిస్తుందో.. ఏప్పుడు సీమాంద్ర ఉద్యమం చల్లబడుతుందో, రెండుప్రాంతాల ప్రజలకు కేంద్ర ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more