ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదన్న సామెత కేవలం ప్రాస కలిసినందుకే వచ్చిందని వాదిస్తారు కొందరు ప్రకృతి వైద్యులు. ప్రకృతిలో అన్నిటిలోనూ ఔషధ గుణాలున్నట్లే ఉల్లిపాయలో కూడా ఉన్నాయి. శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తుంది, ఎండ దెబ్బ తగిలినవారికి ఉపచారంలా పనిచేస్తుంది అంతే కానీ ఉల్లిని తల్లితో పోల్చటం సరికాదని అంటారు.
ఉల్లిపాయ మనిషిలో రాజస తామసగుణాలను పెంచుతాయి కాబట్టి తినకపోవటం మంచిదంటారు యోగులు. అందుకే ఆశ్రమాలు, కొన్ని కులాలలో ఉల్లి వాడకాన్ని నిషేధించటం జరిగింది.
కానీ మాంసాహారం, మసాలాలతో కూడిన వంటకాలలో ఉల్లి లేకపోతే ఆశించిన రుచి అందదు కాబట్టి ఉల్లిపాయ అన్ని కూరలు, సాంబారు, పులుసులలో అవసరమైంది. అందుకే ఉల్లి తరిగేటప్పుడే కాదు కొనేటప్పుడు కళ్ళల్లో నీరు వస్తోందంటున్నారు మహిళలు.
ఇంతకీ ఉల్లి లొల్లి దేనికంటే ఉల్లి ధర ఢిల్లీలో కిలో 80 కి చేరుకునేసరికి రాష్ట్రంలో కిలో 10 నుంచి 20 రూపాయల వరకూ పెరిగిపోయాయి. దాన్ని అదుపుచేసే తీరిక ఎవరికీ లేదు. ఎందుకంటే దేశంలోనూ, రాష్ట్రంలోనూ, పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల వరకూ పాకి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయాలు మరే విషయాన్నీ గుర్తుకు రానివ్వటం లేదు, ప్రాధాన్యతనివ్వనివ్వటం లేదు.
మహారాష్ట్రలో లసల్ గాఁవ్ అతి పెద్ద ఉల్లి విపణ కేంద్రం. ఆసియా ఖండంలోనే పెద్దది. అక్కడ ఉల్లి టోకు ధర కిలో 41.25 కి చేరింది. ఇది ఇలాగే పెరిగితే బంగారం మీద పెట్టినట్టు దీనిమీద కూడా తాత్కాలిక పెట్టుబడులు పెరిగిపోతాయేమో అనిపిస్తోంది కదూ. జరిగింది కూడా అదే. రైతు బజార్లలోకి ఉల్లి ఎక్కువ ప్రమాణంలో రాకుండా వ్యవసాయదారుల దగ్గరికే పోయి కొనుగోలు చేసి గోదాముల్లో దాచుకుని రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నవారిని అదుపులోకి తెస్తే ఉల్లి ధర దిగిపోతుంది.
కానీ దాని వలన లాభమేముంది, లాభమొచ్చే పనులు, కాస్త డబ్బులు మిగుల్చుకునే పనులు చేపట్టాలి కాబట్టి, పాకిస్తాన్, చైనా, ఈజిప్ట్, ఇరాన్ దేశాల నుంచి ఉల్లి పాయలను దిగుమతి చేసి ఆ విధంగా రేట్లను పెంచే ప్రక్రియలో భాగంగా గ్లోబల్ టెండర్లు కోరటం జరిగింది. నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో దిగుమతులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more