రెండు రాష్ట్రాలలోనూ అభివృద్ధిని చూడాలంటే సీమాంధ్రుల మనసులోని భయాందోళనలను పోగొట్టటం అవసరమని, అందుకు చర్చలే ప్రముఖ పాత్ర వహిస్తాయని మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. రెండు రాష్ట్రాల వలన ప్రయోజనమే కలుగుతుందని అర్థం చేసుకోవాలంటే ఇరు ప్రాంతాలకు చెందిన టిఎన్జీవో, ఏపి ఎన్జీవో సంఘాల నాయకులు కలిసి కూర్చుని మాట్లాడుకోవటం ఎంతైనా అవసరమని శుక్రవారం మీడియా సమావేశంలో డిఎస్ అన్నారు.
తెలుగు మాట్లాడేవారు వ్యాపారంలో రాణిస్తారన్న సత్యం జగమంతా ఎరిగినదేనని, అందువలన రాష్ట్ర విభజన తెలుగువారి మధ్యలో చిచ్చు రగిలించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డ డిఎస్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జంటనగరాలలో నివాసముంటున్నవారు భయాందోళనలకు గురికావలసిన అవసరం ఎంతమాత్రం లేదని, ఇక్కడ నివాసమున్నవారిని బయటకు పంపించేసే అధికారం ఎవరికీ లేదని, అందువలన హైద్రాబాద్ విషయంలో అనవసరంగా ఆదుర్దా పడవద్దని అన్నారు.
సీమాంధ్రులకు ప్రోత్సాహంగా, వెయ్యి కిలోమీటర్ల కోస్తా ప్రాంతమంతా అరడజను ఓడరేవులతో ఇంకా అభివృద్ధి చెందటానికి ఎంతో అవకాశమున్నదని చెప్తూ తెలంగాణా ప్రాంతంలో లాగా కాకుండా సీమాంధ్రలో రాజధానిగా మలుచుకోవటానికి ఎన్నో నగరాలున్నాయన్న సంగతి తెలియజేసారు డిఎస్.
చాలాకాలంగా మౌనంగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ ఒక్కసారిగా రాజకీయ చైతన్యంతో మీడియాను పిలిచి మరీ మాట్లాడటంతో రాజకీయ వర్గాల్లో, ఢిల్లీలో ఆయనేదో పెద్ద వరాన్నే అందిపుచ్చుకునివుంటారనే భావన కలుగుతోంది. అది కేవలం కొత్త రాష్ట్రంలో తిరిగి పిసిసి పదవా లేకపోతే ఇంకా పెద్ద పదవా అన్నది చర్చించుకుంటున్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more