Minister kavuri sambasivarao breaks his silence on state bifurcation

minister kavuri sambasivarao, kavuri sambasivarao comment on state bifurcation, state bifurcation, congress party, sonia gandhi, pm manmohan singh,

minister kavuri sambasivarao breaks his silence on state bifurcation

నాలుగేళ్లు ఆగాం... నాలుగు రోజులు ఆగలేరా? కావూరి

Posted: 08/10/2013 12:17 PM IST
Minister kavuri sambasivarao breaks his silence on state bifurcation

సమైక్యవాదిగా సదస్సులు, సభలు నిర్వహించి, లెక్చరర్ దంచిన కావూరి సాంబశివరావు అందరి తెలుసు. సమైక్యాంద ఉద్యమనేతగా ముందుండి నడిపిన నాయకుడు కావూరి సాంబశివరావు. అలాంటి కావూరి కాంగ్రెస్ హైకమాండ్ మీద అలిగి, రాజీనామా ముగ్గులు వేసిన విషయం తెలిసిందే. అయితే కావూరి రాజీనామా ముగ్గులకు రంగులు అద్దిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు జై అంటూ రాజీనామాను వెనక్కి తీసుకున్నాడు. అయితే కావూరి లో సహనం ఎంత ఉందో.. సమైక్యాంద్ర సెగ కూడా ఆయన అంతే ఉన్న విషయం తెలిసిందే. అయితే కావూరి సెగపై సోనియాగాంధీ కేంద్ర మంత్రి పదవి ఇచ్చి, ఆయనలో రగుతున్న సమైక్యాంద్ర సెగపై నీళ్లు పోసింది. పదవిని అందుకున్న మొదటి రోజే .. సమైక్యాంద్ర మీద యూటర్న్ తీసుకొని, సమైక్యాంద్ర ఉద్యమానికి దూరమైన విషయం తెలిసిందే.

 

రాష్ట్రం పై సోనియా దే అంతిమ నిర్ణయం అని కావూరి మీడియా ముందు చెప్పటంతో కావూరి సమైక్యంద్రలో నిరసనలు వెల్లువెత్తాయి. గత నెల 31న రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ హైకమాండ్ ఒక ప్రకటన చేసింది. దీని పై సీమాంద్రలో ఆందోళనలు, నిరసనలు, రేగాయి. సీమాంద్ర నాయకులపై ఒత్తిడి పెరిగింది. సీమాంద్ర నాయకులంత రాజీనామాలు చెయ్యాలని సీమాంద్ర ప్రజలు ఒత్తిడి పెంచారు. ఆ ఒత్తిడి తలొగ్గి కొంతమంది సీమాంద్ర నేతలు రాజీనామాలు చేశారు. కేంద్రమంత్రులు మాత్రం రాజీనామా చెయ్యలేదు. మంత్రి పదవి వచ్చి మూడు నెల్లుకూడా కాకుండానే రాజీనామా చెయ్యమంటే.. కావూరి మనస్సు అందుకు అంగీకరించలేదు. రాజీనామా నేను చెయ్యను, విభజనపై నేను మాట్లాడేది ఏం లేదు.. అంటూ మీడియ ముందు కావూరి కాకి కూతులు కూసిన విషయం తెలిసిందే. అయితే రోజు మళ్లీ మీడియా ముందు వచ్చారు కావూరి సాంబశివరావు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే పరిస్థితులు మరింత సంక్లిష్టం అవుతాయని కావూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. కొందరి వ్యక్తుల కోసం రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదనేది తన అభిప్రాయమన్నారు.

 

42మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ను విభజించి సాధించేది ఏంటని కావూరి ప్రశ్నించారు. కలిసి ఉంటేనే గౌరవం ఉంటుందని కావూరి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు వస్తూనే ఉంటాయని కావూరి అన్నారు. విభజనపై తన అభిప్రాయాన్ని కేంద్రానికి తెలిపానని ఆయన అన్నారు. తాను యూటర్న్ తీసుకోలేదని, కొంతమంది తాను యూటర్న్ తీసుకున్నానంటే బాధ వేస్తుందన్నారు. తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ రాష్ట్రంగా ఉందని తన భావన అన్నారు. రాష్ట్ర విభజన జరగకూడదనే అనుకున్నానన్నారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే జరిగిందని కావూరి అన్నారు. ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ వచ్చి జీవిస్తున్నవారు..... ఇప్పుడు హైదరాబాద్ తమది కాదు అనేది అందర్ని బాధిస్తుందన్నారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల విభజన మంచిది కాదని, చిన్న రాష్ట్రాల వల్లే ఎలాంటి అభివృద్ధి, ప్రయోజనం ఉండదనేది తన అభిప్రాయమన్నారు. రాష్ట్ర విభజన దేశానికి మంచిది కాదని 9మంది కేంద్రమంత్రులు కేంద్రానికి తెలిపామని కావూరి అన్నారు.

 

భవిష్యత్లో వచ్చే పరిణామాలు, సమస్యలను అధిష్టానానికి వివరించినట్లు తెలిపారు. ఆలస్యం చేయకుండా సముచిత నిర్ణయం తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు కావూరి చెప్పారు. తమ విజ్ఞాపనల ఫలితంగానే ఆంటోనీ కమిటీని కేంద్రం వేసిందని ఆయన తెలిపారు. నాలుగేళ్లు ఆగామని.... ఇంకా నాలుగు రోజులు ఆగి చర్చల అనంతరం నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. అయితే ఇప్పటికి కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని కావూరి తెలిపారు. అయితే కావూరి ఎటు యూటర్న్ తీసుకున్నాడో అనేది క్లారిటీగా చెప్పటంలేదు. తొమ్మిది మంది కేంద్ర మంత్రులు ఉండి కూడా తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టడం చాలా బాధగా ఉందని తెలుగు ప్రజలు అంటున్నారు. నాలుగు రోజులు ఆగితే ఏం జరుగుతుందో కూడా కావురి చెప్పి ఉంటే బాగుండేదని సీమాంద్ర నాయకులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more