నిన్నటి వరకు వంద సీట్లు 20 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం అని బీరాలు పలికిన గులాబీ బాస్ ఆశలు అవిరిగా మారుతున్నాయి. గులాబీ బాస్ తో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన గులాబీ నేతలు గోడ దూకే పనిలో బిజీగా ఉన్నారు. అర్థరాత్రి పూట గులాబీలు పట్టుకొని కాంగ్రెస్, టిడిపిల నేతల కొంపల చుట్టు తిరుగుతున్నారు. సీనియర్ నాయకుడు కనిపిస్తే చాలు.. చేతికి గులాబీ ఇచ్చి, మెడలో మల్లెపుల దండ వేసి, తమను రాజకీయంగా బతికించాలని కోరుకుంటున్నారు. ఇలా రోజు రోజుకు గోడ దూకే గులాబీ నేతల లిస్టు పెరిగిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట్ర ప్రకటన నేపథ్యంలో ముందస్తు బెర్తుల కోసం నేతలు అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వలస బాటలో ఉన్నారు. మాజీ మంత్రులు గుండె విజయరామారావు, చందూలాల్ ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్తో సమావేశమయ్యారు. టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరే అంశంపై మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన, కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీన ప్రచారంతో గులాబీలు తమ రాజకీయ భవితవ్యం కోసం ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ముందస్తుగా కాంగ్రెస్లో చేరితే కొంత మేరకైనా ప్రాముఖ్యత ఉంటుందన్న ఆశతో బేరసారాలు సాగిస్తున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మాజీ మంత్రి విజయరామారావు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా మరో ఎనిమిది మంది గులాబీ నేతలు కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారం రోజుల్లో తెరాసని కాంగ్రెసులో విలీనం చేయకపోతే, తానే వారిని కాంగ్రెసు పార్టీలో చేర్పిస్తానని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి కపిలవాయి దిలీప్ కుమార్ అల్టిమేటం జారీ చేశారు. టీఆర్ఎస్ ను కాంగ్రెసులో విలీనం చేయాలంటే చేయాలని, సమయం వృథా చేయవద్దని సూచించారు. కేంద్రమంత్రి అజిత్ సింగ్, ఎపి కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ల ద్వారా తమను కాంగ్రెసులో చేర్చాలని ఎనిమిది మంది గులాబీ నేతలు తనను సంప్రదించారన్నారు. టీఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో వారం రోజులు చూస్తానని, లేకుంటే తానే వారిని కాంగ్రెసులో చేర్చుతానని దిలీప్ కుమార్ చెప్పారు. తెలుగుదేశం పార్టీలోకి ముగ్గురు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. రాములమ్మ దారిలోనే గులాభీ నేతలు కూడా వెళ్లటంతో ..గులాబీ బాస్ భవనంలో గులాబీ కాంతులు తగ్గినట్లు తెలుస్తోంది. ఇలా గోడ దూకే నేతలపై గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more