సమైక్యాంధ్ర ఉద్యమంలో జరుగుతున్న సంఘటనలను ఎప్పటికప్పుడు తెలియజేసే ప్రయత్నంగా దీనిలో ఎప్పటికప్పుడు విశేషాలను చేర్చుతున్నాం. ఈ పేజీని రిఫ్రెష్ చెయ్యటం ద్వారా తాజా విశేషాలను తెలుసుకోవచ్చు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో కళాశాల విద్యార్థులు, విధులను బహిష్కరించి న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. చీరాలలోని వివిధ సంఘాలు సమిష్టిగా ఆందోళన నిర్వహించి సోనియా గాంధీ కెసిఆర్ ల శవయాత్రలను నిర్వహించారు.
గుంటూరు జిల్లా బాపట్లలో మూడవరోజు ఉద్యమం వెల్లువెత్తుతోంది. కార్యాలయాలు, దుకాణాలు, విద్యాసంస్థలు మూతబడ్డాయి. విద్యార్థి ఐకాస సోనియా గాంధీ, కెసిఆర్ ల దిష్టి బొమ్మలను దగ్ధం చేసారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను ఊరేగించి దహన సంస్కారాలు చేసారు. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించి ఆమె రాజీనామా చెయ్యాలంటూ పట్టుబట్టారు.
విశాఖ జిల్లా మాడుగుల, కృష్ణా జిల్లా గన్నవరం, కైకలూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి తూర్పు గోదావరి జిల్లా మండపేట శాసన సభ్యులు రాజీనామాలు చేసారు.
నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేసారు. అయితే తెదేపా నాయకులు కూడా రాజీనామాలు చెయ్యాలని తెదేపా కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థి ఐకాస సభ్యులు డిమాండ్ చేసారు. కావలిలో టాక్సీ యజమానులు ప్రదర్శనలను నిర్వహించారు. వెంకటగిరి ఆత్మకూరు ప్రాంతాలలో కూడా ఆందోళన మిన్నుముట్టింది.
కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుల రాజీనామాలు ఎనిమిదికి చేరాయి. లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి, సాయిప్రతాప్, ఉండవల్లి అరుణకుమార్, ఎస్ పి వై రెడ్డి లు రాజీనామాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ కి అందజేసారు. రాజ్య సభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు తన రాజీనామాను రాజ్య సభ జనరల్ సెక్రటరీకి అందజేసారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి తన రాజీనామాను సోనియా గాంధీకి ఫాక్స్ లో పంపించానని తెలియజేసారు.
అయితే, పార్లమెంటులో తమ అభిప్రాయాన్ని తెలియజేయటానికి ఉన్న అవకాశాన్ని చెయిజార్చుకోవద్దని దిగ్విజయ్ సింగ్ సూచించారని కేంద్ర మంత్రి పురంధేశ్వరి చెప్పారు. కొన్ని రాజీనామాలు దిగ్విజయ్ సింగ్ దగ్గరుండటం విశేషం.
రాష్ట్ర మంత్రి మహీధరరెడ్డి తన రాజీనామాను ముఖ్యమంత్రి కి అందజేసారు. విశాఖ శాసన సభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ తన రాజీనామాను శాసన సభతో పాటు పార్టీ విప్ కి కూడా చేస్తూ స్పీకర్ కి ఫాక్స్ ద్వారా పంపించారు.
సీమాంధ్రప్రాంత ఉద్యోగులు తమ హక్కుల పరిరక్షణ కోరుతూ హైద్రాబాద్ సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు.
మంత్రి విశ్వరూప్ తన రాజీనామాను ముఖ్యమంత్రికి అందజేసారు.
గుంటూరు జిల్లా తెనాలిలో సభాపతి నాదెండ్ల మనోహర్ ఇంటిని సమైక్యాంధ్ర ఉద్యమకారులు ముట్టడించారు. ఆయనను ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చెయ్యవలసిందిగా కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more